మరో అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నటసింహం బాలకృష్ణ. అఖండాతో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టిన బాలయ్య.. వరుస రికార్డ్స్ తో అభిమనులకు దిల్ ఖుష్ చేస్తున్నాడు.
ఆమధ్య కాలంలో వరుస ఫ్లాప్లతో సతమతమైపోయిన బాలకృష్ణకు అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో పట్టలేని సంతోషానిచ్చింది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా.. ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడమే కాకుండా.. వరుసగా రికార్డ్స్ ను బ్రేక్ చేస్తూ.. దూసుకుపోయింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది.
అఖండా రిలీజ్ అయ్యి 5 నెలల్ పైనే అవుతున్నా.. ఈసినిమా ప్రబంజనం ఆగడం లేదు. ఇప్పటికీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఈమూవీలో అఘోరాగ బాలకృష్ణ నటనకు విమర్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. హిందూ ధర్మాలు, హిందు టెంపుల్స్ గురించి బోయపాటి చెప్పిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా.. బుల్లితెరపై, ఓటీటలలో కూడా సంచలనం సృష్టించింది అఖండా.
ఇక తాజాగా అఖండ సినిమా మరో అరుదైన ఘనతను సాధించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా వారంరోజులు థియేటర్లో ఉంచడమే ఎక్కువ. అది 50రోజులు ఆడిందంటే అది గొప్ప విషయం. అలాంటిది అఖండ ఏకంగా 175రోజులు ఆడింది. గుంటూరులోని చిలకలూరిపేటలో ఉన్న రామకృష్ణ థియేటర్లో అఖండ 175రోజులు పూర్తి చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నారు.
దీనిపై థియేటర్ యాజమాన్యం కూడా స్పందించింది. సినిమా విడుదలై ఇన్ని రోజులైనా ప్రేక్షకాదరణ ఏ మాత్రం తగ్గలేదని కలెక్షన్లు బాగానే వస్తుండంటంతో సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్నామని అన్నారువారు. ఇక ఈమూవీకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఈ విషయం గతంలోనే బోయపాటి చెప్పాడు. బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా తరువాత అనిల్ రావిపూడి సినిమాలో జాయిన్ కాబోతున్నాడు.