గోపీచంద్ మలినేని నెక్ట్స్ చిత్రం ఏ హీరోతో అంటే...

By Surya PrakashFirst Published Jan 14, 2023, 7:08 AM IST
Highlights

  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో  'వీరసింహారెడ్డి'   ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో వీర మాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. 

గాడ్ అఫ్ మాసస్ గా చెప్పబడుతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ,  దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన  యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీరసింహారెడ్డి'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మించిన 'వీరసింహారెడ్డి' మొన్న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై.. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని, అన్ని చోట్ల రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో దర్శకుడు గోపీచంద్ మలినేని  నెక్ట్స్ చిత్రం ఏమిటి...ఏ హీరోతో చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్ కు వేరే హీరోలతో ఆఫర్స్ ఉన్నాయి కానీ ఆయన దృష్టి మొత్తం పవన్ కళ్యాణ్ పై ఉందని చెప్తున్నారు. ఈ మేరకు ఓ కథ రెడీ చేస్తున్నారని, కానీ ఇంకా ప్రాజెక్టు ఖరారు కాలేదని తెలుస్తోంది.  అయితే ఇప్పుడు పవన్ చేయాల్సిన సినిమాల లైన్ చాలా  పెద్దగా వుంది. ముందు కమిటైన మూడు సినిమాలు పూర్తి కావాలి. మరో ప్రక్క ఆయన జనసేన పై పూర్తి దృష్టి పెట్టారు. ఆ తర్వాతే మరో సినిమా. అనుకున్నట్లుగా గోపిచంద్ మలినేని- పవన్ సినిమా ఓకే అయితే మాత్రం ఒక క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లే అంటున్నారు.
 
'వీరసింహారెడ్డి' చిత్రం ప్రమోషన్స్ లో  భాగంగా  గోపీచంద్ మలినేని ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాడు. క్రాక్ తర్వాత బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కోసం రెండు కథలు రెడీ చేశానని అన్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.... ”క్రాక్ విడుదల ఇంకా కాలేదు. అప్పుడే మైత్రీ మేకర్స్ నాతో సినిమా ఫిక్స్ చేశారు. అప్పటి నా దగ్గర బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న రెండు కథలు వున్నాయి. బాలకృష్ణ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ కోసం రెడీ చేసుకున్న కథ కూడా బావుంటుంది. అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. నేను ముందు నుండి చెబుతున్నాను. నాకు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ అంటే వీర అభిమానం. నేను వాళ్ళ ఫ్యాన్ ని ” అని చెప్పుకొచ్చారు. 
 

click me!