నిర్మాతలతో పాటు ధనుష్ ని కలిసిన శేఖర్ కమ్ముల

By team teluguFirst Published Jul 3, 2021, 10:29 AM IST
Highlights

క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాతలుగా ఉన్న సునీల్ నారంగ్, నారాయణ దాస్, పి రామ్మోహనరావు లతో పాటు శేఖర్ కమ్ముల ధనుష్ ని కలవడం జరిగింది. యూనివర్సల్ అప్పీల్ తో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కోసం పేరున్న సాంకేతిక నిపుణులను తీసుకోనున్నారట. 

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల హీరో ధనుష్ తో మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ, హిందీ బాషలలో తెరకెక్క నున్న ఈ మూవీ ప్రకటనతోనే భారీ ప్రచారం దక్కించుకుంది. శేఖర్ కమ్ముల కెరీర్ లో మొదటిసారి ఓ కమర్షియల్ హీరోతో మూవీ చేయడం, అది కూడా ధనుష్ లాంటి టాలెంటెడ్ హీరో కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుండగా, శేఖర్ కమ్ముల, ధనుష్ ని ఆయన నివాసంలో కలిశారు. 


ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిర్మాతలుగా ఉన్న సునీల్ నారంగ్, నారాయణ దాస్, పి రామ్మోహనరావు లతో పాటు శేఖర్ కమ్ముల ధనుష్ ని కలవడం జరిగింది. యూనివర్సల్ అప్పీల్ తో భారీగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కోసం పేరున్న సాంకేతిక నిపుణులను తీసుకోనున్నారట. ఇక ఈ మూవీలో నటించే ఇతర నటుల వివరాలు తెలియాల్సి ఉంది. 


మరోవైపు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ విడుదల కావాల్సి ఉంది. నాగ చైతన్య,  జంటగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడగా సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే మూవీ విడుదల కానుంది. 

click me!