తారక్ భయ్యా అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఎన్టీఆర్ కు ఓదార్పు

Published : Aug 30, 2018, 09:07 PM ISTUpdated : Sep 09, 2018, 12:43 PM IST
తారక్ భయ్యా అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఎన్టీఆర్ కు ఓదార్పు

సారాంశం

డల్లాస్ కన్సర్ట్ ను నందమూరి హరికృష్ణకు అంకితం చేయాలని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  

హైదరాబాద్: డల్లాస్ కన్సర్ట్ ను నందమూరి హరికృష్ణకు అంకితం చేయాలని ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  

"డల్లాస్‌ కన్సర్ట్‌ను నందమూరి హరికృష్ణ  గారికి అంకితం ఇస్తున్నా"నని ఆయన హరికృష్ణకు నివాళులు అర్పించారు. హరికృష్ణ ఆకస్మిక మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో గతంలో తాను దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

 

"కొన్ని నెలల క్రితం ఆయనతో ఫొటో తీసుకున్నాను. ఎంతో ఆత్మీయత కలిగిన వ్యక్తి ఆయన. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సర్‌" అని అన్నారు. 

"తారక్‌ భయ్యా, కల్యాణ్‌రామ్‌ గారు మేమంతా మీకు తోడుగా ఉన్నాం. స్వర్గం నుంచి హరికృష్ణ గారు మనల్ని దీవిస్తూనే ఉంటారు. డల్లాస్‌ కన్సర్ట్‌ను ఆయనకు అంకితం చేస్తున్నా" అని ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

Rajini Kamal Friendship: రజనీకాంత్‌-కమల్ హాసన్‌ స్నేహం వెనుక రహస్యం చెప్పిన లతా రజనీకాంత్.. కారణం ఏంటంటే?
Anchor Sreemukhi: శ్రీముఖి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుందో తెలుసా? టాప్ సీక్రెట్ వెల్లడించిన స్టార్ యాంకర్..