బిగ్ బాస్ సీజన్ 2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మరో ఆరు రోజుల్లో సీజన్ 2 విజేత ఎవరనేది తేలిపోనుంది.
బిగ్ బాస్ సీజన్ 2 లో గ్రాండ్ ఫినాలే సందడి మొదలైంది. కౌశల్, దీప్తి, గీతామాధురి, తనీష్, సామ్రాట్ లు ఫినాలేకి చేరుకున్నారు. మరో ఆరు రోజుల్లో సీజన్ 2 విజేత ఎవరనేది తేలిపోనుంది. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో తమతో పాటు ఎవరు ఫినాలేకి రావాలనుకుంటున్నారో.. అలానే ఎవరు ఫినాలేకి అర్హులు కారో చెప్పాలని బిగ్ బాస్ సూచించారు.
ఈ టాస్క్ పూర్తయిన తరువాత హౌస్ లోకి 'నన్ను దోచుకుందువటే' టీమ్ వచ్చి సందడి చేసింది. వారు వెళ్లిపోయిన తరువాత దీప్తి, గీతామాధురి కూర్చొని ఏదో చర్చించుకుంటుండగా.. మధ్యలోకి కౌశల్ వచ్చాడు.
'నేను లేకపోతే అసలు టాస్క్ లో ఫైటింగ్స్ ఉండవు కదా..' అంటూ చాలా గర్వంగా చెప్పగా.. దానికి గీతా, దీప్తిలు.. మీరు లేకపోయినా.. టాస్క్ లలో గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయంటూ అతడు సంచాలకుడిగా వ్యవహరించినప్పుడు, అలానే మంచి-చెడు టాస్క్ లలో గొడవలు జరిగిన సందర్భాలను గుర్తు చేశారు. అలానే కెప్టెన్సీ టాస్క్ లో గీతా, బాబు గోగినేనిల మధ్య గొడవని గుర్తు చేయగా.. అది నావల్లే కదా జరిగింది అంటూ మళ్లీ మధ్యలోకి ఎంటర్ అయ్యి ఏదో చెప్పబోయిన కౌశల్ తో క్లారిటీగా ఆ గొడవ జరిగింది కాదని దీప్తి, గీతాలు అన్నారు.
ఈ విషయాలను సామ్రాట్ వద్ద ప్రస్తావించగా.. అతడితో అసలు మాట్లాడడం మానేస్తే మంచిదని సూచించాడు. దానికి దీప్తి 'మేం మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడితే ఎలా రియాక్ట్ అవ్వకుండా ఉంటామంటూ' వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
సీనియర్ తో కౌశల్ ప్రేమకథ.. రక్తంతో లవ్ లెటర్!
బిగ్ బాస్2: కౌశల్ కి ఫైనల్ కి వెళ్లే అర్హత లేదు.. టార్గెట్ చేసిన హౌస్ మేట్స్!