అమితాబ్‌, అక్షయ్‌ని తాకిన పెట్రో, రైతు ఉద్యమ సెగలు..

Published : Feb 21, 2021, 09:06 PM IST
అమితాబ్‌, అక్షయ్‌ని తాకిన పెట్రో, రైతు ఉద్యమ సెగలు..

సారాంశం

రైతు ఉద్యమం, పెట్రో ధరల మంటలు సెలబ్రిటీలకు తగిలాయి. దీనిపై బిగ్‌ స్టార్స్ స్పందించడం లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మరో స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ రైతు మద్దతు యాత్ర, పెట్రోల్‌ ధరల పెరుగుదల విషయంలో వీరు స్పందించనందుకు వారి సినిమాలు ప్రదర్శించకుండా అడ్డుకుంటామని  కాంగ్రెస్‌ నాయకుడు నానా పటోలే హెచ్చరించారు.

రైతు ఉద్యమం, పెట్రో ధరల మంటలు సెలబ్రిటీలకు తగిలాయి. దీనిపై బిగ్‌ స్టార్స్ స్పందించడం లేదంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, మరో స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ రైతు మద్దతు యాత్ర, పెట్రోల్‌ ధరల పెరుగుదల విషయంలో వీరు స్పందించనందుకు వారి సినిమాలు ప్రదర్శించకుండా అడ్డుకుంటామని, షూటింగ్‌లు జరుగకుండా చూస్తామని కాంగ్రెస్‌ నాయకుడు నానా పటోలే హెచ్చరించారు. దీంతో ఇది బాలీవుడ్‌లో, మహారాష్ట్రలో దుమారం రేపుతుంది. 

దీనిపై తాజాగా స్పందించారు కేంద్ర మంత్రి రామ్‌దాస్‌ అరావలే. `హిందీ, మరాఠీ సినీ పరిశ్రమలు ముంబయి నగరానికి గౌరవ ప్రతీకలని, సినీ పరిశ్రమ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలిగిస్తుంది. వాటిని అడ్డుకోవడం సమంజసం కాద`న్నారు. `ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి బెదిరింపులకు స్థానం లేదు. ఒకవేళ కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి బెదిరింపులను అమలు ఏసినట్టయితే రిపబ్లికన్‌ పార్టీ కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి సినీ పరిశ్రమకు అండగా నిలబడతారు. అమితాబ్‌, అక్షయ్‌లకు రక్షణ కవచంగా మారుతుంది` అని తెలిపారు.  

ఇదిలా ఉంటే కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్‌ ధరలకు వ్యతిరేకంగా అమితాబ్‌, అక్షయ్‌ లు సోషల్‌ మీడియాలో `మేం కార్లయితే కొనగలం, కానీ పెట్రోల్‌కొనలేం` అని కామెంట్‌ చేశారని, అలాంటిది ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని నానా పటోలే డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సెలబ్రిటీలు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటులు అండగా తాము ఉంటామని కేంద్రమంత్రి వెల్లడించారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?