ఓట్‌ వినియోగించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఫస్ట్ సెలబ్రిటీ ఆయనే

Published : Dec 01, 2020, 07:53 AM ISTUpdated : Dec 01, 2020, 12:31 PM IST
ఓట్‌ వినియోగించుకున్న మెగాస్టార్‌ చిరంజీవి.. ఫస్ట్ సెలబ్రిటీ ఆయనే

సారాంశం

సెలబ్రిటీల్లో ఓట్‌ని వినియోగించుకున్న సెలబ్రిటీగా చిరంజీవి నిలిచారు. ఆయన జూబ్లీహిల్స్ లో ఓట్‌ని వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి వచ్చి ఓట్‌ వేశారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. సినీ సెలబ్రిటీలు సైతం భారీగా వచ్చి తమ ఓట్‌ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల్లో ఓట్‌ని వినియోగించుకున్న సెలబ్రిటీగా చిరంజీవి నిలిచారు. ఆయన జూబ్లీహిల్స్ లో ఉదయం 7.30గంటల సమయంలో ఓట్‌ని వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి వచ్చి ఓట్‌ వేశారు. 

ఈ సందర్భంగా ఆయన తాను ఓట్‌ వేసినట్టుగా సింబల్‌ ఇచ్చారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కోవిడ్‌ నిబంధనల కారణంగా ఆయన మాస్క్ ధరించి వచ్చారు. కరోనా రూల్స్ ని స్టిక్ట్ గా ఫాలో అయ్యారు. ఇక మెగాస్టార్‌ తనయుడు, హీరో రామ్‌ చరణ్‌ కూడా చిరుతో కలిసి రావాల్సి ఉంది. కానీ ఆయన ప్రస్తుతం `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌లో ఉన్న నేపథ్యంలో మధ్యలో వచ్చి ఓట్‌ని తన సతీమణి ఉపాసనతో కలిసి ఓట్‌ వేయనున్నట్టు తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?