మోహన్‌బాబుకి చిరంజీవి సంజాయిషీ.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌

Published : Oct 18, 2021, 07:38 AM IST
మోహన్‌బాబుకి చిరంజీవి సంజాయిషీ.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌

సారాంశం

`మా` ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ఎన్నికల తర్వాతనే అసలైన రచ్చ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుకి చిరంజీవి ఫోన్‌ చేశాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. 

`మా`(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌)కి సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు కాదు, ఎన్నికల తర్వాతే అసలు రచ్చ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల ఫలితాల రోజు మంచు విష్ణు.. చిరంజీవి ప్రస్తావన తేవడం మరింత వివాదంగా, చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల పోటీ నుంచి చిరంజీవిగారు తనని తప్పుకోమని మోహన్‌బాబుకి ఫోన్‌ చేసినట్టు విష్ణు తెలిపారు. అదే సమయంలో మోహన్‌బాబు సైతం పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

దీంతో Maa వివాదం మరింతగా ముదురుతూ వస్తోంది. దీనికితోటు పోలింగ్‌ రోజు Mohanbabu తమపై దాడి చేశారని ప్రకాష్‌రాజ్‌ ఆరోపించారు. ఎన్నికల అధికారికి లేఖ రాస్తూ పోలింగ్‌ రోజు సీసీటీవీ ఫుటేజీ అందించాలని, అందులో వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. అయితే ఈ ఫుటేజీని పోలీసులు సీజ్‌ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా మోహన్‌బాబుకి Chiranjeevi ఫోన్‌ చేశారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. 

మోహన్‌బాబుకి చిరు ఫోన్‌ చేసిన సంజాయిషీ చెప్పినట్టు తెలుస్తుంది. తాను ఎవరికీ మద్దతు ఇవ్వలేని మోహన్‌బాబుకి చిరు వెల్లడించారట. అకారణంగా తన పేరు బయటకు వచ్చిందని చెప్పారట. అనవసరంగా తనని ఇందులోకి లాగారని ఆయన ఆవేదన చెందినట్టు, తన తరఫున మోహన్‌బాబుకి సంజాయిషీ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై మోహన్‌బాబు కూడా సానుకూలంగా స్పందించారని, అందరం కలిసికట్టుగానే ఉండాలనేది తన అభిమతమని చెప్పినట్టు సమాచారం. 

also read:అలయ్ బలయ్ వేదికపై ఎడమొహం పెడమొహంగా మంచు విష్ణు పవన్... వైరల్ గా మంచు విష్ణు ట్వీట్!

ఇదిలా ఉంటే నిన్న(ఆదివారం) ఏర్పాటు చేసిన అలాయ్‌ బలాయ్‌ కార్యక్రమంలో `మా` అధ్యక్షుడు Manchu Vishnu, పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. ఇందులో మంచు విష్ణుతో మాట్లాడేందుకు అనాసక్తిని చూపించారు Pawan. విష్ణు నమస్కారం పెట్టినా పవన్‌ చూడకుండా ఆయన్నిదాటవేసే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మంచు విష్ణుకి, ప్రకాష్‌రాజ్‌ ప్యానెల్‌కి మధ్య జరిగిన Maa Election మంచు విష్ణు గెలుపొందారు. దీంతో ప్రకాష్‌ రాజ్‌ ప్యానెల్‌నుంచి గెలుపొందిన సభ్యులు రాజీనామా ప్రకటించిన విసయం తెలిసిందే. వాటిని లెక్కచేయకుండా తాజాగా మంచు విష్ణు `మా` అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం చేశారు.

also read:ఫ్యాన్స్ తో సమావేశంలో చిరంజీవి ఆవేదన.. ఆక్సిజన్ బ్యాంక్స్ కి కారణం ఆ ఊరిలో జరిగిన సంఘటనే

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు