పద్మవిభూషణ్‌ వచ్చాక మొదటిసారి పబ్లిక్‌లోకి చిరంజీవి.. వరుణ్‌ తేజ్‌ సినిమా కోసం గెస్ట్ గా..

By Aithagoni RajuFirst Published Feb 24, 2024, 2:33 PM IST
Highlights

మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల ప్రతిష్టాత్మక `పద్మవిభూషణ్‌` పురస్కారం వరించింది. ఈ నేపథ్యంలో ఆయన మొదటిసారి పబ్లిక్‌లో మెరవబోతున్నారట. దీంతో ఆయన ఏం మాట్లాడబోతున్నారో ఆసక్తికరంగా మారింది. 
 

మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ కోసం పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. వరుణ్‌ సినిమాని సపోర్ట్ చేసేందుకు వస్తున్నారు. ఇటీవల చిరంజీవి గెస్ట్ గా వచ్చిన `హనుమాన్‌` మూవీ సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు తన కొడుకు సినిమా ఫంక్షన్‌కి వస్తున్నాడంటే ఈ మూవీపై కూడా ఆసక్తి పెరుగుతుంది. 

వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం `ఆపరేషన్‌ వాలెంటైన్స్` చిత్రంలో నటిస్తున్నారు. ఎయిర్‌ ఫోర్స్ ప్రధానంగా సాగే యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఉగ్రవాదుల ఎటాక్‌కి రివేంజ్‌ తీర్చుకునే కథాంశంతో ఈ మూవీ రూపందుతుంది. శక్తి ప్రతాప్‌ సింగ్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. తెలుగులో ఎయిర్‌ ఫోర్స్ ప్రధానంగా సినిమా రావడం ఇదే తొలి సారి. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేసేలా ఉంది. ఈ మూవీ మార్చి 1న తెలుగు, హిందీలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ట్రైలర్‌ని రామ్‌చరణ్‌, సల్మాన్‌ ఖాన్‌ విడుదల చేయడంతో బజ్‌ ఏర్పడింది. 

Latest Videos

ఇప్పుడు మెగాస్టార్‌ని దించుతున్నారు. `ఆపరేషన్‌ వాలెంటైన్స్` చిత్రానికి రేపు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయబోతున్నారు. దీనికి చిరంజీవి గెస్ట్ గా రాబోతున్నారు. తాజాగా టీమ్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే మెగాస్టార్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ విభూషణ్‌ వచ్చిన అనంతరం ఆయన మొదటిసారి బయటకు వస్తున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఈవెంట్‌లో సల్మాన్‌ని సత్కరించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే చిరు నుంచి వచ్చే మాటలు సైతం ఆసక్తిని రేకెత్తించబోతున్నాయి. 

The operation gets a MEGA addition 😎

Padma Vibhushan, Megastar garu to grace the Grand Pre-Release Event of TOMORROW at JRC Conventions,Hyd🔥

Book your passes here🎟️
- https://t.co/K3hGgjknlx pic.twitter.com/NSXe9ekxAl

— Renaissance Pictures (@RenaissancePicz)

`ఆపరేషన్‌ వాలెంటైన్స్` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ రేపు ఆదివారం(ఫిబ్రవరి 25)న హైదరాబాద్‌లోని జేఆర్‌సీలో గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌ని చాలా స్పెషల్‌గా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌ ఎయిర్‌ఫోర్స్ అధికారిగా కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా, రాడార్‌ ఆఫీసర్‌ పాత్రలో మానుషి చిల్లర్‌ నటిస్తుంది. రుహానీ శర్మ, నవదీప్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని మార్చి 1న రిలీజ్‌ చేయబోతున్నారు. అంతేకాదు దీనితో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్‌ తేజ్‌. 

Read more: RC 16: రాంచరణ్, బుచ్చిబాబు చిత్రం నుంచి క్రేజీ అప్డేట్.. 'సైరా' డీవోపీ ఫిక్స్
 

click me!