'మైత్రి మూవీ మేక‌ర్స్' నుంచి కాస్టింగ్ కాల్

By AN TeluguFirst Published May 4, 2019, 4:14 PM IST
Highlights

తెలుగులో వరసగా శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్దలం వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ముగ్గురు క‌లిసి నడుపుతున్న ఈ  మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌ విలక్షణమైన చిత్రాలకు మారు పేరుగా మారింది.

తెలుగులో వరసగా శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్దలం వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్. న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్, మోహ‌న్ ముగ్గురు క‌లిసి నడుపుతున్న ఈ  మైత్రి మూవీ మేకర్స్ బేన‌ర్‌ విలక్షణమైన చిత్రాలకు మారు పేరుగా మారింది. రీసెంట్ గా చిత్రలహరి చిత్రంతో మెగా మేనల్లుడుకు హిట్ ఇచ్చిన బ్యానర్  తమ బ్యానర్ లో నిర్మించబోయే చిత్రానికి కాస్టింగ్ కాల్ ఇచ్చారు.

9 నుండి 11 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న అమ్మాయిలు తమ సినిమాలో నటించటానికి కావాలని ఈ కాస్టింగ్ కాల్ సారాంసం. ఉత్సాహం ఉన్నవారు మేక‌ప్ లేకుండా త‌మ పిల్లల ఫోటోల‌ని వాట్సాప్ చేయాల‌ని కోరింది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం. సినిమాలో న‌టించాల‌నే ఆస‌క్తి ఉన్న బాలిక‌లు వెంట‌నే త‌మ ఫోటోల‌ని పంపితే ఆ అవకాసం మీకే దక్కచ్చు.

ఇక ఇప్పుడు ఈ బేన‌ర్‌లో డియ‌ర్ కామ్రేడ్, గ్యాంగ్ లీడ‌ర్, వైష్ణ‌వ్ తేజ్ డెబ్యూ చిత్రం,అల్లు అర్జున్ 20వ చిత్రం రూపొందుతున్నాయి. 

 

*Important Announcement* pic.twitter.com/srsIPafF4R

— Mythri Movie Makers (@MythriOfficial)
click me!