breaking: హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు.. కారణాలివేనా?

By Aithagoni RajuFirst Published Jan 21, 2022, 6:51 PM IST
Highlights

మాస్‌ మహారాజా రవితేజ తల్లిపై కేసు నమోదైంది. రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

మాస్‌ మహారాజా రవితేజ(Raviteja) తల్లిపై కేసు నమోదైంది. రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మిపై కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. రవితేజ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నెంబర్‌ 108,124లో పుష్కర కాలువ, స్లూయిజ్‌ నిర్మాణ పనులను భూపతి రాజ్యలక్ష్మితోపాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌ అనే వ్యక్తి ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రభుత్వ ఆస్తులను అధికారుల అనుమతి లేకుండా ధ్వంసం చేసినందుకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దీనిపై రవితేజగానీ, ఆయన తల్లి నుంచిగానీ ఎలాంటి స్పందన లేదు. రవితేజ ఎలా స్పందిస్తారో అనేది ఆసక్తిగా మారింది. కానీ ఎప్పుడూ లేదని రవితేజ తల్లి వార్తల్లో నిలవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

ఇక రవితేజ వరుస పరాజయాల అనంతరం `క్రాక్‌` సినిమాతో హిట్‌ కొట్టి ఇప్పుడు కెరీర్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన `ఖిలాడీ` చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. దీంతోపాటు `రామారావు`, `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితోపాటు మరో చిత్రాలు ఆయన జాబితాలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలను లైనప్‌లో పెట్టి జెట్‌ స్పీడ్‌లో సినిమాలు చేస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాదే రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 

click me!