బిగ్ బాస్2: ఈ వారం ఎవరికి మూడిందంటే..?

By Udayavani DhuliFirst Published Sep 22, 2018, 4:37 PM IST
Highlights

నాని హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్2 వంద ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ఈ షో పూర్తికానుంది. ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే హౌస్ లో ఉన్నారు. 

నాని హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్2 వంద ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ఈ షో పూర్తికానుంది. ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే హౌస్ లో ఉన్నారు. ఈ ఆరుగురు చివరి ఎలిమినేషన్ ని నామినేట్ కావడంతో హౌస్ నుండి ఎవరు వెళ్లిపోతున్నారనే విషయంలో సర్వత్రా ఆసక్తి నెలోకోండి. ఈ ఆరుగురిలో ఇప్పటికే ఒకరు ఫినాలేకి చేరుకున్నారు.

'మీ గుడ్డు జాగ్రత్త' టాస్క్ లో విజేతగా నిలిచిన సామ్రాట్ గ్రాండ్ ఫినాలే లో అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్ అయ్యారు. దీంతో సామ్రాట్ కి ఈ వారం ఎలిమినేషన్ నుండి మినహాయింపు వచ్చింది. కౌశల్ కి ఆడియన్స్ లో ఉన్న ఆదరణతో ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి. కాబట్టి ఆయన కూడా నేరుగా ఫినాలేకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో దీప్తి నల్లమోతుకి కౌశల్ కంటే ఎక్కువ ఓట్లు వస్తున్నాయని టాక్.

ఈసారి కూడా ఆమెకు ఓట్లు బాగానే పడ్డాయని సమాచారం. కాబట్టి దీప్తి కూడా సేవ్ అయ్యే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. మహిళల్లో గీతామాధురికి క్రేజ్ ఏర్పడడంతో ఆమె కూడా బిగ్ బాస్ హౌస్ లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మొదటి నుండి ఎలిమినేషన్స్ నుండి ఎస్కేప్ అవుతూ వస్తోన్న తనీష్ ఈసారి ఓట్లు దక్కించుకోవడంలో నాల్గో స్థానంలో ఉన్నాడని సమాచారం.

కాబట్టి అతడు కూడా ఫినాలేకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఇక ఎటొచ్చి ఈ వారం మూడింది రోల్ రైడాకి అని తెలుస్తోంది. నిజానికి గుడ్లు జాగ్రత్త టాస్క్ లో రోల్ గనుక గెలిచుంటే అతడు డైరెక్ట్ గా ఫినాలేకి వెళ్లేవాడు. కానీ ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. రోల్, సామ్రాట్ లకు తక్కువ ఓట్లు నమోదయ్యాయి.

సామ్రాట్ కి ఎలిమినేషన్ నుండి మినహాయింపు రావడంతో కచ్చితంగా రోల్ వెళ్లిపోతాడని తెలుస్తోంది. గత సీజన్ లానే ఈ సారి సీజన్ 2లో కూడా  ఐదుగురు ఫైనల్ కంటెస్టెంట్స్ ఉండబోతున్నారు. రోల్ రైడా నిష్క్రమిస్తే.. తనీష్, గీత, దీప్తి, కౌశల్, సామ్రాట్‌లు గ్రాండ్ ఫినాలే ఉండబోతున్నారనేది ఓ అంచనా. 
 

click me!