బిగ్ బాస్2: ఇక్కడ కాబట్టి బతికిపోయావ్.. కౌశల్ కి తనీష్ వార్నింగ్!

By Udayavani DhuliFirst Published Sep 20, 2018, 10:55 AM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 లో సోమవారం ఎపిసోడ్ నుండి హౌస్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ హౌస్ మేట్స్ అందరూ అతడిపై మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగారు. 

బిగ్ బాస్ సీజన్ 2 లో సోమవారం ఎపిసోడ్ నుండి హౌస్ లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కౌశల్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ హౌస్ మేట్స్ అందరూ అతడిపై మూకుమ్మడిగా మాటల యుద్ధానికి దిగారు. దీంతో కౌశల్ కూడా కొన్ని సార్లు సహనం కోల్పోయి వారి మీద అరవడం, అవమానించే విధంగా కామెంట్స్ చేయడం జరుగుతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో పెద్ద వార్ జరిగింది.

ముందుగా గీతామాధురి చర్చ మొదలుపెట్టింది. కౌశల్ కూతురు పుట్టినరోజు నాడు ఆమెని ఇంట్లోకి పంపాలని కౌశల్ గతవారంలో నానిని రిక్వెస్ట్ చేశాడు. ఇదే టాపిక్ మీద గీత.. కౌశల్ తో మీ అమ్మాయి వస్తే మీకు బూస్టింగ్ లా ఉంటుంది కాబట్టి ఆమెని పంపారేమో అన్నట్లుగా కామెంట్ చేసిందట. అయితే గీతా మాత్రం బూస్టప్ అనే పదాన్ని తను వాడలేదని హౌస్ మేట్స్ కి చెప్పే క్రమంలో అక్కడకి వచ్చిన కౌశల్ ఆమెతో వాగ్వాదానికి దిగారు.

చిన్న గొడవ కాస్త పెద్ద వివాదానికి దారి తీసింది. కౌశల్ హౌస్ మేట్స్ తో.. ''నేను మాట్లాడుతుంటే అందరూ కుక్కల్లా మీద పడిపోతారు'' అంటూ నోరుజారారు. అంతే సామ్రాట్, తనీష్, రోల్ అందరూ కౌశల్ మీదకి వెళుతూ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ గొడవకి దిగారు. తనీష్ ఆగ్రహంతో ''ఇక్కడ కాబట్టి బతికిపోయావ్ కౌశల్.. ఆ గేట్ దాటిన తరువాత ఈ మాట అంటే అప్పుడు ఉండేది'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకి వెళ్లాక నేనేంటో చూపిస్తా.. అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు తనీష్.  

click me!