
బాహుబలి సినిమాకు దేశవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు బాహుబలి మానియా మొదలై పోయనట్టే కనిపిస్తోంది. వచ్చే నెెల్లో రిలీజ్ కానున్న బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా బాలీవుడ్ ఖాన్స్ సినిమాలకన్నా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఖాన్స్ సినిమాలు ఐదువేల థియేటర్స్ వరకు రిలీజవటం పరిపాటి. కానీ బాహుబలి మాత్రం అంతకన్నా ఎక్కువ థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నారు.
బాహుబలిలో తలెత్తిన సందేహాలకు సమాధానాలు తెలియాలంటే బాహుబలి2 చూడాల్సిందేనంటున్నాడు చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి2 ట్రైలర్తో సినిమాపై అంచనాలను మరింత పెంచాడు జక్కన్న. దీంతో ఏప్రిల్ 28 కోసం ప్రభాస్ అభిమానులతో పాటు సినీ జనం కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంచనాలను అందిపుచ్చుకోవడానికి చిత్ర నిర్మాతలు సినిమా విడుదలకు భారీ సన్నాహాలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా బాహుబలి2ను 6,500 స్క్రీన్స్లో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలిసింది. అంతేకాదు మరో వెయ్యి స్క్రీన్స్పై ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. ట్రైలర్కు ఊహించని రీతిలో స్పందన రావడంతో నిర్మాతలకు సినిమా కలెక్షన్లపై మరింత నమ్మకం పెరిగింది. దీంతో మొదట అనుకున్న స్క్రీన్స్ కంటే ఇంకొన్ని పెంచినట్లు సమాచారం. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో బాహుబలి2 ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. 120 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కింది. ఒక భారతీయ సినిమా ఇన్ని స్క్రీన్స్లో రిలీజ్ అవుతుండటం ఇదే తొలిసారి అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.