బాహుబలి రెండు పార్ట్ లు కలిపి ఒకే పార్ట్ గా రీ రిలీజ్

First Published Sep 24, 2017, 3:27 AM IST
Highlights
  • తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన బాహుబలి మూవీ
  • ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం
  • బాహుబలి రెండు పార్ట్ లు కలిపి ఒకే పార్ట్ గా రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన బాహుబలి తెలుగు సినిమా "మార్కెట్ రేంజ్" ను బాలీవుడ్ వరకు విస్తరింప జేసింది. బాహుబలి పార్ట్ 2 1500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి దేశ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం లిఖించింది.

 

దేశవ్యాప్తంగా అంత సంచలనాలు సృష్టించిన బాహుబలి రెండు పార్టులుగా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాహుబలి టీమ్ మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోంది. రెండు పార్టులుగా విడుదలై సంచలనాలు సృష్టించిన బాహుబలి సినిమాలను ఇప్పుడు ఒకే భాగంగా ఎడిట్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్.  

 

ఇప్పటికే చైనాలో బాహుబలి 2 ది కంక్లూజన్ ను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమైన బాహుబలి బృందం ఇతర భారతీయ భాషల్లో కూడా "బాహుబలి" చిత్రం కొత్త వర్షన్ ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు భాగాలు కలిపి మూడు గంటలకు ఎడిట్ చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ రీ-రిలీజ్ తో బాహుబలి ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. బాహుబలి లవర్స్ కు ఇది నిజంగా శుభవార్తే.

click me!