Prema Entha Madhuram: పద్దు చేసిన తప్పు వల్లే అనుకి కష్టం.. భార్య, బిడ్డ కోసం ఆ పని చేసిన ఆర్య?

By Navya ReddyFirst Published Mar 21, 2023, 10:31 AM IST
Highlights

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ గా ముందుకి దూసుకుపోతుంది. తన కుటుంబ గౌరవం కోసం కష్టపడే ఒక వ్యక్తి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మార్చి 21 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో పద్దు ఒక జ్యోతిష్యాలయానికి వెళ్లి తనకి జరిగిన కలని అంతా వివరించి చెప్తుంది. ఒకవేళ నా అనుమానమే నిజమై అష్టమి ఘడియలలో కానీ అను ప్రసవిస్తే తల్లికి బిడ్డకి ప్రమాదం ఉంటుంది ఎలాగైనా గండం గట్టెక్కించాలి అని దేవుడి దగ్గరికి వచ్చాను అంటుంది. మనుషులు అవసరానికి కావలసిన మొక్కులు మొక్కి గట్టెకేసిన తర్వాత వాటిని మర్చిపోతారు.

మీ విషయం లో కూడా అదే జరిగింది ఎప్పుడో తీర్చుకోవాల్సిన మొక్కులను అలాగే ఉంచేసావు అని అనగా అవునమ్మా అమ్మి పుష్పవతి అయినప్పుడు నూటొక బిందెల అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. పెళ్ళికి ముందు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఒక మొక్కుకున్నాను కానీ ఇప్పుడు మా అమ్మి కడుపుతో ఉన్నది అవి ఎలా చేయాలి అని అడుగుతుంది పద్దు. ఆ దేవుడే మీకు పరిష్కారం ఇస్తాడు సంకల్పం మంచిదైతే చాలు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తుంది ఆ అమ్మ. 

ఆ తర్వాత సీన్లో అను వాళ్ళ ఇంటికి వెళ్తుంది పద్దు. జరిగిన విషయం అంతా చెప్పగా నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను కదమ్మా ప్రసవం అయ్యాక  మంచి రోజు చూసి చేద్దాము అని అంటుంది అను. ఇది చేసేదే నీకు బిడ్డకి మంచి ప్రసవం జరగాలి అని నీ బదులు నేను చేస్తాను అమ్మ అని అంటుంది. అమ్మ నువ్వు ఇప్పుడు ఎందుకు అలా కంగారు పడుతున్నావు ఆ తల్లి రక్షణలో మనకు ఎప్పుడూ రక్షణ ఉంతుంది. నేను చేసుకున్న పుణ్యాలు నన్ను కాపాడతాయి.

నువ్వు ఇంకేమీ చెప్పొద్దు. ఈ వయసులో నూట ఒక బిందులు మోయడం అంటే మంచిది కాదు అంటుంది అను. దాంతో పద్దు అక్కడ నుంచి కోపం తో వెళ్ళిపోతుంది. ఇంతలో ఆర్య వచ్చి మీరేమీ భయపడొద్దు పద్దు గారు నేను చేస్తాను కావాల్సినవన్నీ నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్తాడు. ఈ పూజలో అత్తింటి వైపు నుంచి బట్టలు కావాలి అని అంటుంది పద్దు. అను, మాట్లాడండి సార్ మన బిడ్డకు అత్తయ్య వాళ్ళ ఆశీర్వాదాలు కూడా కావాలి కదా అని అంటుంది.

ఆ తర్వాత సీన్లో శారదమ్మ తన కుటుంబం అంతటితో కలిసి గుడికి వస్తుంది. ఎప్పుడు దూరం పెడదామని చూసిన సరే ఏదో ఒక పూజలు, వ్రతాలు అని వాళ్ళు ఇక్కడికి దగ్గర అయిపోతూనే ఉన్నారు అని అనుకుంటుంది మాన్సీ. లోపలికి వచ్చిన తర్వాత శారదమ్మ పద్దు వాళ్ళని చూస్తుంది. మీరు ఆ కల గురించి చెప్పినప్పటి నుంచి నాకు భయం మొదలైంది. ఎంత త్వరగా ఇవన్నీ చేస్తే అంత త్వరగా గండం గట్టెక్కుతుంది అంటుంది.

తర్వాత పద్దు మాన్సీ కి పసుపు కుంకాలు పెడతాను అని అంటుంది. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అనగా అవసరమే కొన్ని తప్పవు అని అంటుంది శారదమ్మ. ఇష్టం లేకున్నా సరే పసుపు కుంకాలు తీసుకొని తాళిబొట్టు మీద పెట్టించుకుంటుంది మాన్సీ.  ఇంతలో అను, ఆర్యలు అక్కడ కనబడతారు. పూజకు అన్నీ సిద్ధమే కదా అని అనుకునే లోగా పక్కన ఎవరో వ్యక్తి వచ్చి కడుపుతో ఉన్నప్పుడు ఇలాగా 101 బిందుల నీళ్లు అభిషేకం చేయడం ఏంటి అని అంటారు.

తను చేయడం లేదు తన స్థానంలో తన భర్త చేస్తున్నారు అని పద్దు అంటుంది. అలా భర్త కూడా ఎలా చేయగలరు అలా కుదరదు ఇది ధర్మం కాదు కదా అని అంటుంది. ఇంతలో పంతులుగారు వచ్చి ఆనాడు రాముడు కూడా సీతాదేవి బంగారుపు శిల్పాన్ని పక్కన పెట్టుకొని పూజ చేశాడు ఇప్పుడు ఇది కూడా అంతే తన భార్య బిడ్డ బాగుండాలి అనే సంకల్పంతో తన భార్య తీర్చాల్సిన మొక్కు తను తీర్చుతున్నాడు ఇది న్యాయమే కదా అని అంటాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

click me!