ఎన్టీఆర్ సరసన అమీజాక్సన్?

Published : Oct 02, 2017, 05:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఎన్టీఆర్ సరసన అమీజాక్సన్?

సారాంశం

రూ.100కోట్ల క్లబ్ లో ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ త్వరలో పట్టాలెక్కనున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా హీరోయిన్ గా అమీజాక్సన్ ని ఎంచుకున్నట్లు టాక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘జై లవ కుశ’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇటీవల రూ.100కోట్ల మైలు రాయిని కూడా దాటేసింది. ఈ సినిమా తర్వాత తారక్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

 

మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇలోపు  ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక పనిలో పడ్డారట. ఇప్పటికే కీలక  పాత్రల కోసం పలువురు సీనియర్ నటులను ఎంపిక చేశారట. ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

 

ఐ, ఎవడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన   అమీజాక్సన్.. ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల సినిమాకి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాక్. ఈ విషయం తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

PREV
click me!

Recommended Stories

అందుకే పవన్ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..
'మన శంకర వరప్రసాద్ గారు' సెన్సార్ రివ్యూపై నిర్మాత కామెంట్స్..ఆ సినిమాల వల్లే థియేటర్ల సమస్య