`పుష్ప 2` టీమ్‌కి అల్లు అర్జున్‌ స్టిక్ట్ రూల్‌.. ఆ పని చేయాల్సిందేనట..?

Published : Mar 04, 2024, 06:01 PM IST
`పుష్ప 2` టీమ్‌కి అల్లు అర్జున్‌ స్టిక్ట్ రూల్‌.. ఆ పని చేయాల్సిందేనట..?

సారాంశం

`పుష్ప 2` సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. దర్శకుడు సుకుమార్‌ వేరే రేంజ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందానికి హీరో అల్లు అర్జున్‌ స్టిక్ట్ రూల్‌ పెట్టాడట. 

ఇండియన్‌ మోస్ట్ వాంటెడ్‌ మూవీస్‌లో `పుష్ప2` ఒకటి. ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రమిది. క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ రూపొందించారు. తొలి భాగం భారీ విజయాన్ని సాధించడంతో రెండో పార్ట్ ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు సుకుమార్‌. బడ్జెట్‌ పెంచారు. సినిమా స్కేల్‌ని పెంచారు. మరింత లావిష్‌గా తెరకెక్కిస్తున్నారు. 

ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా చివరి దశకు చేరుకుందనే వార్తలు వచ్చాయి. కానీ ఇంకా చాలా షూటింగ్‌ పార్ట్ మిగిలి ఉందట. ఆ మధ్య క్లైమాక్స్ షూట్‌ చేస్తున్నారని అన్నారు. కానీ చాలా పార్ట్ షూట్‌ చేయాల్సి ఉందట. ఈ నేపథ్యంలో ఫాస్ట్ గా చిత్రీకరణ చేస్తున్నారట. అయితే షూటింగ్‌ విషయంలో బన్నీ చాలా కమిట్‌ మెంట్‌తో ఉన్నారట. సినిమాని అనుకున్న టైమ్‌కి విడుదల చేయాలని భావిస్తున్నారట. 

ఆగస్ట్ 15న విడుదల చేయాలని ప్రకటించిన నేపథ్యంలో ఆ టైమ్‌కే ఫిక్స్ కావాలని చెప్పాడట బన్నీ. ఈ మేరకు షూటింగ్‌ కంప్లీట్‌ చేసేలా టీమ్‌కి, సుకుమార్‌కి ఆదేశాలు జారీ చేశారట. ఈ మేరకు మధ్యలో గ్యాప్‌ లేకుండా చిత్రీకరణ జరపాలని తెలిపారట. ఎలాంటి బ్రేక్‌ లేకుండా చిత్రీకరణ చేయాలని, అనుకున్న టైమ్‌కే సినిమాని పూర్తి చేసి స్వాతంత్ర్య దినోత్సవానికి సినిమాని రిలీజ్‌ చేయాలని తేల్చి చెప్పారట. ఈ విషయంలో మార్పు లేదని బన్నీ సూచించినట్టు సమాచారం. ఈ మేరకే షూటింగ్‌ వేగంగా చేస్తున్నారని తెలుస్తుంది. 

బన్నీ ఎర్రచందనం స్మగ్లర్‌ పుష్పరాజ్‌గా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన్నా నటిస్తుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా ఫహద్‌ ఫాజిల్‌ కనిపించనున్నారు. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో సునీల్‌, అనసూయ, రావు రమేష్‌లు నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. `పుష్ప2` మూడో పార్ట్ కూడా ఉంటుందట. ఇటీవల బన్నీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీన్ని సిరీస్‌లాగా చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇక ఈ మూవీ బిజినెస్‌ లెక్కలు కూడా షాకిస్తున్నాయి. ఇండియాలోనే హైయ్యేస్ట్ బిజినెస్‌ జరుగుతుందని అంటున్నారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో