భారీ నిర్మాణ సంస్థతో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్ ?

By team teluguFirst Published Jan 19, 2022, 5:26 PM IST
Highlights

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయిన ఈ చిత్రం అనూహ్యంగా హిందీలో కాసుల వర్షం కురిపించింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయిన ఈ చిత్రం అనూహ్యంగా హిందీలో కాసుల వర్షం కురిపించింది. హిందీ ప్రేక్షకులకు పుష్ప మూవీ తెగ నచ్చేసింది. బాలీవుడ్ లో ఈ చిత్రం రూ.70 కోట్ల పైనే వసూళ్లు సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సాధారణమైన ఫీట్ కాదు. 

ఈ చిత్రంలో అల్లు అర్జున్ తన యాటిట్యూడ్, మాస్ గెటప్, డైలాగ్ డెలివరీ ప్రతి అంశంలో అలరించాడు. పుష్ప చిత్రం అల్లు అర్జున్ కి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పుష్ప పార్ట్ 2 పై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. పుష్ప చిత్రంపై నెలకొన్న క్రేజ్ చూసి అప్పుడే బన్నీకి పాన్ ఇండియా ఆఫర్స్ మొదలయ్యాయి. 

భారీ చిత్రాలని నిర్మించే లైకా ప్రొడక్షన్స్ సంస్థ అల్లు అర్జున్ తో సినిమా నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ఈ సంస్థ బన్నీతో ప్లాన్ చేస్తోందట. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ కు లైకా ప్రొడక్షన్స్ సంస్థ రూ. 75 కోట్ల కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్. 

దీనితో ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న తెలుగు హీరోగా బన్నీ రికార్డు సృష్టించాడని అంటున్నారు. పుష్ప పార్ట్ 2 పుష్ప ది రూల్ మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్పలో బన్నీ నటన హైలైట్ గా నిలిచింది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అనసూయ, సునీల్, అజయ్ ఘోష్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. 

click me!