ఎన్నాళ్లకెన్నాళ్లకు, 500 కోట్ల వైపు 'సూర్యవంశీ' పరుగులు.. రాజమౌళికి ఫుల్ జోష్

By telugu teamFirst Published Nov 6, 2021, 5:41 PM IST
Highlights

ఏడాదిన్నర కాలంగా భారత చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. కోవిడ్ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినిమాల సందడి బాగా తగ్గింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో కూడా పరిస్థితులు మెరుగవుతున్నాయి.

ఏడాదిన్నర కాలంగా భారత చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులని ఎదుర్కొంటోంది. కోవిడ్ కారణంగా థియేటర్లు మూతపడడంతో సినిమాల సందడి బాగా తగ్గింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో కూడా పరిస్థితులు మెరుగవుతున్నాయి. భారీ చిత్రాలన్నీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో యావత్ సినీ లోకం మొత్తం ఒక చిత్రం వైపు ఆసక్తిగా చూసింది. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన 'సూర్యవంశీ' చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ చిత్ర బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటూ బాలీవుడ్ తో పాటు దక్షణాది చిత్ర పరిశ్రమ కూడా ఆసక్తిగా ఎదురుచూసింది. చిత్ర పరిశ్రమలో ఉత్సాహం నింపుతూ Sooryavanshi చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది. థియేటర్స్లు హౌస్ ఫుల్ బోర్డులతో కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల సందడితో థియేటర్లు కళకళ లాడుతున్నాయి. 

కొన్ని నెలల క్రితం విదులైన Akshay kumar బెల్ బాటమ్ చిత్రం కనీస వసూళ్ళని కూడా సాధించలేకపోయింది. ఆ టైంలో జనాల్లో ఇంకా కరోనా భయం పోలేదు. మహారాష్ట్రలో 50 శాతం అక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడిచాయి. దీనితో పరిస్థితి ఇలాగే కొనసాగితే సినిమాల రిలీజ్ కష్టం అని అంతా భావించారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. 

Also read: శ్రీజ భర్త ఏమైనట్లు.. మెగా ఫోటోలలో మిస్సింగ్.. మొదలైన రూమర్లు ?

అన్నిచోట్లా థియేటర్లు 100 శాతం అక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. సూర్యవంశీ చాలా కాలం తర్వాత విడుదలైన మాస్ మూవీ కావడంతో జనాలు ఎగబడుతున్నారు. తొలి వారంలోనే సూర్యవంశీ చిత్ర వసూళ్లు 250 కోట్ల మార్క్ ని దాటేస్తాయని ట్రేడ్ అంచనా వేస్తోంది.మొత్తంగా ఈ చిత్రం 500 కోట్లమార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. చిత్ర పరిశ్రమలో సూర్యవంశీ చిత్రం కాన్ఫిడెన్స్ పెంచేసింది. 

Also Read: సమంత సీరియస్ లుక్ చూశారా.. స్టన్నింగ్ ఫోటోస్ వైరల్

ఈ చిత్ర వసూళ్లు Rajamouli కి ఫుల్ జోష్ ఇస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే RRR చిత్రం జనవరి 7న అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి పరిస్థితులు కూడా అనుకూలించాలి. జనాలు థియేటర్లకు వచ్చే మూడ్ రావాలి. దీనితో సూర్య వంశీ చిత్రం కోసం రాజమౌళి కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ చిత్ర రిలీజ్ సందర్భంగా రాజమౌళి సూర్యవంశీ యూనిట్ కి శుభాకాంక్షలు కూడా చెప్పాడు. 

click me!