నాగార్జున, నాగచైతన్యల మరో అక్కినేని మల్టీ స్టారర్

Published : Jan 18, 2017, 09:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:48 PM IST
నాగార్జున, నాగచైతన్యల మరో అక్కినేని మల్టీ స్టారర్

సారాంశం

మనం సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన అక్కినేని ఫ్యామిలీ మరోసారి మల్టీస్టారర్ కోసం ప్లాన్ చేసుకుంటున్న అక్కినేని కుటుంబం వేగేశ్న సతీష్, దిల్ రాజు కాంబినేషన్లో మరోసారి ఫ్యామిలీ మూవీ

ఫ్యామిలీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మనం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అక్కినేని ఫ్యామిలి. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించారు. అఖిల్ కూడా అతిథి పాత్రలో కనిపించటంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇదే ఫ్యామిలీ నుంచి ఓ మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.

దిల్ రాజు నిర్మాతగా శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకు ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

PREV
click me!

Recommended Stories

నటుడు ఉపేంద్రతో లవ్ అంటూ రూమర్స్.. నటి ప్రేమ ఏమన్నారంటే.?
OTT Movie: థియేటర్లలో 20కోట్లు, ఓటీటీలో 100 మిలియన్స్ మినిట్స్ తో దుమ్మురేపుతున్న రియల్‌ లవ్‌ స్టోరీ