Maheshbabu- Mohanbabu: 33 ఏళ్ల తర్వాత మహేష్ మరలా..?

By Sambi ReddyFirst Published Jan 27, 2022, 6:02 PM IST
Highlights

ప్రస్తుతం మహేష్ బాబు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. ఇటీవల కరోనా బారినపడిన మహేష్ సర్కారు వారి పాట షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. మరో నెల రోజుల షూటింగ్ మిగిలి ఉండగా... త్వరలో ప్లాన్ చేస్తున్నారు. కాగా మహేష్ నెక్స్ట్ మూవీ పై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. 


మహేష్ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) తో మూవీ ఓకె చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. మహేష్-త్రివిక్రమ్ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా కాలంగా ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు, ఖలేజా ఆకట్టుకున్నాయి. ఖలేజా కమర్షియల్ గా ఆడకపోయినా మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇక అతడు మూవీ ఎవర్ గ్రీన్ చిత్రంగా నిలిచిపోయింది. బుల్లితెరపై అతడు చిత్రానికి అదిరిపోయే రేటింగ్ దక్కుతుంది. 

దాదాపు 12 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనుంది. ఇక ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడట. మరొక క్రేజీ న్యూస్ ఏమిటంటే ఈ మూవీలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేస్తున్నారట. కథలో ఓ పవర్ ఫుల్ రోల్ కోసం మోహన్ బాబును సంప్రదించగా.. ఆయన పచ్చ జెండా ఊపాడని సమాచారం అందుతుంది. ఇదే నిజమైతే అరుదైన కాంబినేషన్ సెట్ కానుంది. 

మహేష్ బాలనటిగా ఉన్నప్పుడు మోహన్ బాబుతో మహేష్(Mahesh babu) చేశారు. 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం మూవీలో మహేష్, మోహన్ బాబు కలిసి నటించారు. కృష్ణ, విజయశాంతి నటించిన ఆ మూవీలో మోహన్ బాబు విలన్ రోల్ చేస్తారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మహేష్ ది ఆ మూవీలో కీలక రోల్. మోహన్ బాబు, మహేష్ మధ్య సన్నివేశాలు అలరిస్తాయి. 

కాగా మహేష్ ఈ ఏడాది మరో చిత్రం కూడా స్టార్ట్ చేయనున్నారు. రాజమౌళితో మహేష్ మూవీ కన్ఫర్మ్ కాగా... 2022 లో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సర్కారు వారి పాట సమ్మర్ కానుకగా విడుదల కానుంది. దర్శకుడు [పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం సమ్మర్ కి వాయిదా పడింది. సర్కారు వారి పాట మూవీలో మహేష్ లుక్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చింది. మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తుంది. సర్కారు వారి పాట మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. 
 

click me!