ఫ్లాప్ సినిమాకు సీక్వెల్.. ఈసారి ఏమవుతుందో..?

By Udayavani DhuliFirst Published Sep 19, 2018, 6:31 PM IST
Highlights

ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అభినేత్రి'. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది.

ప్రభుదేవా, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అభినేత్రి'. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. హిందీలో ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడినా.. తెలుగు, తమిళ భాషల్లో మాత్రం బోల్తా కొట్టింది. అయితే ఈ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నామని ప్రకటించి షాక్ ఇచ్చాడు ప్రభుదేవా.

ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే సినిమా సెట్స్ పైకి వచ్చేసింది. మారిషస్ లో సైలెంట్ గా సినిమా షూటింగ్ ని ప్రారంభించారు. ప్రభుదేవా ఈ విషయాన్ని చెప్పేవరకు కూడా ఈ సంగతి ఎవరికీ తెలియదు. ఈ సినిమాకు కూడా ఏఎల్ విజయే దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో కేవలం నటీనటులు, టైటిల్ ని మాత్రమే రిపీట్ చేస్తున్నామని, కథ పూర్తిగా కొత్తగా ఉంటుందని.. కాబట్టి సీక్వెల్ అనొద్దంటూ ప్రభుదేవా చెబుతున్నాడు. అభినేత్రిలో కనిపించిన తమన్నా, సోనూసూద్ లు ఈ సినిమాలో కూడా కనిపించబోతున్నారు. అభినేత్రి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దానిపై ప్రభుదేవాకి నమ్మకం మాత్రం పోలేదు. అందుకే మరోసారి తనే డబ్బులు పెట్టి మరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

 

With the super kovai sarala ji , on the way to Mauritius for DEVI 2 pic.twitter.com/btAYRCS9Re

— Prabhudheva (@PDdancing)
click me!
Last Updated Sep 19, 2018, 6:31 PM IST
click me!