మరోసారి తండ్రైన 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్!

By tirumala ANFirst Published Feb 27, 2020, 5:52 PM IST
Highlights

అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది.

అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఘనవిజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది. దర్శకుడు సందీప్ వంగాకు ఈ చిత్రం తిరుగులేని గుర్తింపు తీసుకువచ్చింది. ప్రొఫెషనల్ గా సందీప్ వంగా ప్రస్తుతం హాట్ షాట్ డైరెక్టర్. 

సందీప్ వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషాలు వెల్లివిరిశాయి. తాజాగా సందీప్ వంగ మరోసారి తండ్రయ్యాడు. సందీప్ సతీమణి మనీషా రెడ్డి ఈ మధ్యాహ్నం పండండి అమ్మాయికి జన్మనిచ్చింది. అందుతున్న సమాచారం మేరకు తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. 

తమ జీవితాల్లోకి ఆడబిడ్డ రావడంతో సందీప్ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. సందీప్, మనీషా 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం సందీప్, మనీషాలకు రెండో సంతానంగా పాప జన్మించింది. 

మూడు రెట్లు నష్టపరిహారం.. త్రివిక్రమ్ కు చుక్కలు చూపిస్తున్న 'మైత్రి' ?

సందీప్ తెరకెక్కించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రీమేక్ చేశారు. హిందీ రీమేక్ కు కూడా సందీప్ దర్శత్వంలోనే తెరకెక్కింది. షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. సందీప్ వంగ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాల్సి ఉంది. 

ఛాన్సుల్లేని హీరోయిన్లకు పడుకోవడమే మార్గమా.. హీరోయిన్ హాట్ కామెంట్స్

click me!