ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇది పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. వెబ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 28 రాత్రి పాల వ్యాపారి సంజయ్ యాదవ్ తన ప్రైవేట్ పార్ట్ను కత్తిరించుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. మొదట దీన్ని కుట్రగా భావించారు, కానీ పోలీసుల విచారణలో వెల్లడైన విషయం మరింత దిగ్భ్రాంతికి గురి చేసింది. సంజయ్ తనకు తాను హిజ్రా గురువు కావడానికి డబ్బులు ఇచ్చి మరీ ఈ పని చేశాడు.
ఈ కేసులో పోలీసులు తానియా ఖాన్ అలియాస్ బెంగాలన్, జోగేందర్ అలియాస్ మోహిని, బ్రహ్మ సింగ్ అలియాస్ అజయ్ను అరెస్టు చేశారు. ఏసీపీ వెబ్ సిటీ ఉపాసన పాండే ప్రకారం, సంజయ్ యాదవ్ హిజ్రాల సంపాదన చూసి హిజ్రా గురువు కావాలని ప్లాన్ చేశాడు. దీని కోసం నిందితులకు డబ్బులు ఇచ్చి తన ప్రైవేట్ పార్ట్ను కత్తిరించుకున్నాడు. హిజ్రా గురువు పారోపై ఆరోపణలు వేయడానికి ప్రయత్నించాడు.
సంజయ్ యాదవ్, నిందితుల మధ్య ముందుగానే ఒక కుట్ర జరిగిందని విచారణలో తేలింది. సంజయ్ హిజ్రా గురువు పారోతో ఉన్న గొడవ కారణంగా ఆమెను ఇరికించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 28న తానియా సేవింగ్ బ్లేడ్తో సంజయ్ ప్రైవేట్ పార్ట్ను కత్తిరించి తనతో తీసుకెళ్లింది. ఆ తర్వాత దానిని హరనంది నదిలో పడేసింది. ఈ పని కోసం సంజయ్ 10 వేల రూపాయలు కూడా ఇచ్చాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత సంజయ్ యాదవ్ కొడుకు ప్రిన్స్ తన తండ్రి ప్రైవేట్ పార్ట్ను హిజ్రా గురువు పారో కత్తిరించారని ఆరోపించాడు, దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ నిజం బయటకు రావడంతో పోలీసులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ ఘటనలో ఉపయోగించిన బ్లేడ్, సంజయ్ కత్తిరించిన ప్రైవేట్ పార్ట్ను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.