మేం ఆ మ్యాచ్ ఓడిపోలేదు.. అది టై..! 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-పాక్ పోరుపై అప్పటి పాకిస్తాన్ సారథి కామెంట్స్

By Srinivas MFirst Published Sep 14, 2022, 6:06 PM IST
Highlights

IND vs PAK: ఇంటర్నేషనల్  క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారిగా నిర్వహించిన 2007 టీ20 ప్రపంచకప్ లో  భారత్-పాక్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ లో టీమిండియా అనూహ్య విజయం సాధించింది.  అయితే 15 ఏండ్ల తర్వాత ఈ మ్యాచ్ గురించి... 

సరిగ్గా 15 ఏండ్ల క్రితం.. ఇదే రోజు (సెప్టెంబర్ 14)న ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్  పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్తాన్ తలపడ్డాయి.  ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు.. షోయభ్ మాలిక్ సారథ్యంలోని  పాకిస్తాన్‌ను  ఓడించి అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అవడంతో బౌల్ అవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ గెలిచినట్టు కాదని.. మేం ఓడినట్టు అంతకన్నా కాదని అంటున్నాడు నాటి పాకిస్తాన్ సారథి షోయభ్ మాలిక్. 

ఈ మ్యాచ్ లో బౌల్ అవుట్ లో భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్పలు  మూడు బంతుల్లో మూడుసార్లు వికెట్లు పడగొట్టారు.  కానీ పాకిస్తాన్ మాత్రం మూడుసార్లు విఫలమై  పరాజయం పాలైంది. క్రికెట్ లో  అంతకుముందు లేని ఈ నిబంధనను  2007  పొట్టి ప్రపంచకప్ లోనే తొలిసారిగా  ప్రవేశపెట్టారు.

ఇక మ్యాచ్ పూర్తై 15 ఏండ్లు గడిచిన సందర్భంగా షోయభ్ మాలిక్ స్పందిస్తూ.. ‘ఈ మ్యాచ్ టై అవడంతోనే మాకు ఈ నిబంధన (బౌల్ అవుట్) గురించి తెలిసింది. అయితే అప్పుడు నేను మా బౌలర్లకు ఒక్కటే చెప్పాను. మీరు వికెట్లమీదకు గురిపెట్టండి.. ఒత్తిడికి గురికావొద్దు అని చెప్పా.  కానీ ఇందులో మేం విజయవంతం కాలేకపోయాం. అయితే ఈ మ్యాచ్ లో మేం వంద శాతం మా బెస్ట్ఇచ్చాం. ఈ మ్యాచ్ లో మేం ఓడిపోలేదు. బౌల్ అవుట్ లో మాకు కలిసిరాలేదంతే..’ అని చెప్పాడు.

 

in 2007 - Dhoni's Tactical Brilliance Made India to beat Pakistan in a ball-out in T20 World Cup. 🐐👑 pic.twitter.com/oFJkyscANp

— 🄺Ⓐ🅃🄷🄸🅁 1⃣5⃣ (@katthikathir)

అయితే  మాలిక్ కామెంట్స్ పై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో కౌంటర్లిస్తున్నారు. బౌల్ అవుట్ అయినా మరేదైనా.. ఐసీసీ నిబంధనల  ప్రకారం ఓటమిని ఓటమే  అంటారని ఆయనకు ఎవరైనా చెప్పండ్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.  ఈ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20  ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141  పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయి బౌల్ అవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఇక ఇదే  టోర్నీలో  భాగంగా ఫైనల్ పోరులో భారత్-పాకిస్తాన్ లే మళ్లీ తలపడ్డాయి.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్.. 19.3ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వార భారత్.. తొలి టీ20 ప్రపంచకప్ ను  సగర్వంగా  అందుకుంది. 

 

IND vs PAK WT20 Final 2007: India won the World Cup by 5 runs. The match that never forgotten. played a fantastic knock in so much pressure. Unbelievable striking by Misbah. In the end Couldn't held the nerves and got out. What a match ! pic.twitter.com/3KWjeQZR3U

— Ahmed Kazim (@iamAhmedKazim31)
click me!