దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ఇదే: రోహిత్ స్థానంలో పృథ్వీషా

Siva Kodati |  
Published : Mar 08, 2020, 04:09 PM IST
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ఇదే: రోహిత్ స్థానంలో పృథ్వీషా

సారాంశం

ఐపీఎల్‌కు ముందు టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 18వ తేదీ వరకు ఈ సిరీస్ జరగనుంది.

ఐపీఎల్‌కు ముందు టీమిండియా కీలక సిరీస్‌కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 18వ తేదీ వరకు ఈ సిరీస్ జరగనుంది.

Also Read:మహిళల టీ20 ప్రపంచకప్: ఫైనల్‌లో భారత్ చిత్తు చిత్తు, ఐదోసారి విశ్వవిజేతగా ఆసీస్

గాయంతో బాధపడుతున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సెలక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. అలాగే కొద్దిరోజులుగా జట్టుకు దూరంగా ఉన్న విధ్వంసక ఆటగాడు హార్డిక్ పాండ్యా టీమిండియాలోకి పునరాగమనం చేశాడు.

Also Read:ధోని ఈజ్ బ్యాక్: 5 బంతుల్లో 5 సిక్సులు... వీడియో వైరల్

రోహిత్ గైర్హజరీతో ధావన్-పృథ్వీషా ఓపెనింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినివ్వగా.. వెటరన్ ఆటగాడు కేదార్ జాదవ్‌ను సెలక్టర్లు పక్కనబెట్టారు. 

భారత జట్టు:

విరాట్ కోహ్లీ (కెప్టెన్)
శిఖర్ ధావన్
పృథ్వీషా
కేఎల్ రాహుల్
మనీష్ పాండే
శ్రేయస్ అయ్యర్
రిషబ్ పంత్
హర్డిక్ పాండ్యా
రవీంద్ర జడేజా
భువనేశ్వర్
చాహల్
జస్ప్రీత్ బుమ్రా
సంజయ్ 
కుల్‌దీప్ యాదవ్
శుభమన్ గిల్
 

PREV
click me!

Recommended Stories

IPL చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 విదేశీ ఆటగాళ్లు వీరే.. లిస్టులో ఆసీస్ డామినేషన్!
ఎలుకకు పిల్లి సాక్ష్యం అంటే ఇదేనేమో.! 'టీ20 ప్రపంచకప్‌ను గిల్ తెచ్చేస్తాడట'.. నమ్మేశాం.. నమ్మేశాం