IPL 2025: ఐపీఎల్ 2025 బెస్ట్ ప్లేయర్, కెప్టెన్ ఎవరు? ఫ్యాన్స్ సర్వేలో టాప్ లో నిలిచింది ఎవరు?

Published : Jul 01, 2025, 06:37 PM ISTUpdated : Jul 01, 2025, 08:52 PM IST
1xBet study on IPL 2025 result impact on fans support

సారాంశం

IPL 2025: ఐపీఎల్ 2025లో సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. ముగ్గురిపై దృష్టి పెరిగింది.

IPL 2025: అభిమానుల మద్దతును 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎలా ప్రభావితం చేసిందోననే అంశంపై గ్లోబల్ కంపెనీ 1xBet చేసిన భారీ స్థాయి అధ్యయనం చేసి, ఫలితాలు ఇలా కనుగొనింది. ఈ సీజన్‌లో అనేక పెద్ద ఆశ్చర్యకర పరిణామాలు సంభవించాయి: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మొట్టమొదటి టైటిల్‌ను గెలుచుకోగా, 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అదరగొట్టే అరంగేట్రంతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో సాయి సుదర్శన్ చేసిన అత్యంత మేధావిపూర్వక ప్రదర్శన అతనిని 759 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ కోసం అసలైన అర్హత కలిగినవాడిగా నిలిపింది.

ఈ అధ్యయనంలో భాగంగా 3,000 మంది ప్రతిస్పందకులతో సర్వే నిర్వహించారు. వాళ్లు ఈ సీజన్‌లో తమ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (MVP), అత్యంత విజయవంతమైన కెప్టెన్, అలాగే ఉత్తమ యువ ప్లేయర్‌ను ఎంచుకున్నారు.

అభిమానుల ప్రకారం 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఉత్తమ ప్లేయర్

సీజన్‌కు ముందు, 1xBet ఇలాంటి సర్వేను నిర్వహించగా, అభిమానులు మెచ్చినవాళ్లు ఎలా మారారో చూడండి:

స్థానంIPL 2025 ప్రారంభానికి ముందుIPL 2025 తరువాత
1విరాట్ కోహ్లీ (27,4%)సాయి సుదర్శన్ (45,40%)
2ఎంఎస్ ధోనీ (12,50%)సూర్యకుమార్ యాదవ్ (13,07%)
3రోహిత్ శర్మ(12,4%)విరాట్ కోహ్లీ (8,60%)
4అభిషేక్ శర్మ(11,1%)శ్రేయాస్ అయ్యర్(7,05%)
5జస్‌ప్రీత్ బుమ్రా (4,3%)హెన్రిచ్ క్లాసీన్ (4%)
6యశస్వి జైస్వాల్ (4,2%)జాష్ హేజిల్‌వుడ్ (2,80%)
7హార్దిక్ పాండ్యా (4,0%)అభిషేక్ శర్మ (2%)
8రిషబ్ పంత్ (2,9%)నికొలస్ పూరన్ (1,80%)
9కేఎల్ రాహుల్ (2,5%)సాయి కిషోర్ (1,60%)
10సూర్యకుమార్ యాదవ్ (2,4%)అర్ష్‌దీప్ సింగ్ (1,50%)

 

 

సాయి సుదర్శన్ అత్యంతగా ఆకట్టుకునే పురోగతిని ప్రదర్శించాడు. ఐపీఎల్ 2025 ప్రారంభమయ్యేందుకు ఒక నెల రోజుల ముందు, టాప్ 10 ప్లేయర్‌లలో ఒకడిగా ఇతనిని అభిమానును ఎంచుకోలేదు. కానీ ఛాంపియన్‌షిప్ తరువాత, అతను ర్యాంకింగ్‌లలో లీడర్‌గా నిలిచి, సగానికి పైగా ఓట్‌లను అందుకున్నాడు. ఆసక్తికరంగా, సాయి సుదర్శన్‌కు అతని సొంత రాష్ట్రమైన తమిళనాడు (5.49%) కంటే, మహరాష్ట్ర (11,17%) నుండి అభిమానులు ఎక్కువగా మద్దతు ఇవ్వడం విశేషం.

అభిమానుల ఎంపిక న్యాయమైనదే, ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మ్యాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, ఈ సీజన్‌లో 759 పరుగులు సాధించాడు. ఒత్తిడిలో కూడా అతను నాణ్యమైన ఆటను చూపడంతో పాటు, టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఎలాంటి సందేహం లేకుండా, సాయి సుదర్శన్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉందని, భారత జాతీయ జట్టులో భాగం కాగలడని విశ్వసించవచ్చు.

సూర్యకుమార్ యాదవ్‌కు కూడా గొప్ప సీజన్ లభించింది. ఐపీఎల్ 2025 తరువాత, సీజన్‌కు ముందు చేసిన తర్వే కంటే అతను 10 శాతం అధికంగా ఓట్లను దక్కించుకుని, ర్యాంకింగ్‌లలో 10వ స్థానం నుండి రెండవ స్థానానికి చేరుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌లో పుట్టిన ఇతను, మహారాష్ట్ర టీమ్ తరఫున (9.87%) ఆడుతున్నా సరే, ఆ ప్రాంతానికి అభిమానుల ఓట్లు (12.50%) ఈ స్థాయిలో ఎరుగుదలకు దోహదపడ్డాయని చెప్పాలి.

ఈ ప్లేయర్‌కు అసలైన బలంగా నిలకడ చూపడాన్ని చెప్పాలి. కుడిచేతి వాటంతో ఆడే ఈ బ్యాట్స్‌మన్ సగటున మ్యాచ్‌కు 25కు పైగా పరుగులను స్కోర్ చేసి ఛాంపియన్‌షిప్‌లో ఎంవీపీ అవార్డ్‌ను గెలుపొందాడు. అతని ప్రదర్శన కారణంగా, రెగ్యులర్ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ చక్కగా ఆడి, సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు.

భారతీయ క్రికెట్ దిగ్గజం అయిన విరాట్ కోహ్లీ, 8.60 శాతం అభిమానుల ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు. ఛాంపియన్‌షిప్‌నకు ముందు అతను ర్యాంకింగ్‌లలో లీడర్‌గా నిలిచి, అభిమానుల అంచనాలను అందుకోవడంతో పాటు, ఫైనల్‌లో కీలక పాత్ర పోషించాడు, అలాగే RCB కప్ గెలవాలనే 18 ఏళ్ల తపనను నెరవేర్చాడు. అయితే, సాయి సుదర్శన్, సూర్యకుమార్ యాదవ్‌ల అత్యద్భుత ప్రదర్శనను, అమోఘమైన పురోగతిని ఎవరూ అంచనా వేయకపోవడంతో, కోహ్లీ మూడవ స్థానంతో ముగించాడు.

అలాగే శ్రేయాస్ అయ్యర్ (7.05%), హెన్రిచ్ క్లాసీన్ (4%) ఓట్లతో టాప్ 5లో నిలిచారు. సీజన్‌కు ముందు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ నుండి ఎవరూ ఎక్కువ ఆశించలేదు, అయితే అతని నాయకత్వ లక్షణాలు, ప్రశాంతత కలవడంతో అభిమానుల అభిప్రాయాలు పూర్తిగా మారిపోయి, అతని ఆటతీరుకు సరైన స్థాయిలో 4వ స్థానంలో నిలిపాయి. హెన్రిచ్ క్లాసీన్ మరో విధంగా అభిమానులను మెప్పించి, KKRతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో అతను మెరుపులు విరజిమ్మే హైలైట్‌లతో కూడా 37 బంతులలో ఆకట్టుకునే ఆడాడు.

ఎంఎస్ ధోనీ అతిపెద్ద స్థాయిలో అండర్‌పెర్ఫామ్ చేశాడు. ఐపీఎల్ 2025కు ముందు, టాప్ ప్లేయర్‌లలో అభిమానుల ర్యాంక్‌లో భాగంగా 2వ స్థానంలో నిలిచాడు, అయితే ఛాంపింయన్‌షిప్ చివరకు అతను కనీసం టాప్ 10లో స్థానం కూడా సంపాదించుకోలేకపోయాడు. ఈ పతనం అనేది చెన్నై సూపర్ కింగ్స్ సమగ్ర వైఫల్యం చెందడాన్ని కారణంగా చెప్పాలి, ఈ సీజన్‌లో కేవలం 8 పాయింట్లే పొందిన ఈ టీమ్, జట్టు ర్యాంకింగ్‌లలో అట్టడుగున నిలిచింది.

ఈ అధ్యయనంలో 25-34 వయసువారు అత్యంత యాక్టివ్ ఓటర్‌లుగా ని. సగటున, ప్లేయర్ ఆధారంగా, ఈ వయసు గ్రూప్‌వారు 30-50 శాతం ఓట్లు వేశారు. యువ అభిమానులలో క్రికెట్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని ఈ అధ్యయనం చాటిచెప్పింది. 20-24 ఏళ్ల మధ్య వయసువారు విరాట్ కోహ్లీకి ధృడమైన మద్దతు అందించగా, 25-34 ఏళ్ల వయసు బృందం కూడా క్రియాశీల స్థాయిలో సరిపోలేలా ఓట్లు వేశారు, ఈ రెండు గ్రూప్‌లు కలిసి 33 శాతం ఓట్లు వేశారు.

అభిమానుల ప్రకారం 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముగ్గురు ఉత్తమ కెప్టెన్‌లు

1xBet సర్వే ఫలితాల ప్రకారం, అభిమానుల మద్దతు ఈ కింది విధంగా ఉంది:

1. శ్రేయాస్ అయ్యర్ (PBKS) — 58,50%

2. రజత్ పతీదార్ (RCB) — 23,20%

3. హార్దిక్ పాండ్యా (MI) — 3,80%

అభిమానుల ఓట్లలో సగానికిపైగా పంజాబ్ కెప్టెన్ అందుకోగా, భారీ మార్జిన్‌తో అతను అగ్రస్థానంలో నిలిచాడు. కఠినమైన సమయాలలో తన జట్టు సభ్యులకు ఎలా నాయకత్వం వహించాలో, వారిలో ఉత్తేజం ఎలా నింపాలో శ్రేయాస్ అయ్యర్‌కు బాగా తెలుసు. అదే సమయంలో, అథను అగ్ర స్థాయి ఆట నైపుణ్యాలను చూపుతూ, 175.80% అధిక స్ట్రైక్ రేట్‌ను పొందాడు.

ఈ సీజన్‌లో పంజాబ్ 11 ఏళ్లలో తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు చేరుతుందని అనేకమంది నిపుణులు, అభిమానులు విశ్వసించగా, ఇందుకు ప్రధాన కారణంగా అయ్యర్ కృషిని చెప్పుకోవాలి. జట్టు మీద అతను చూపిన ప్రభావం ఆ ఫ్రాంచైజీ భవిష్యత్తును మార్చేయగా, భారత జాతీయ జట్టుకు కెప్టెన్‌గా అతనికి త్వరలోనే బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. అసలు సిసలైన విజేత మనస్తత్వం కలిగున్న శ్రేయాస్ అయ్యర్, ఒకే ఒక వ్యక్తి కూడా మార్పు తీసుకురాగలడని చెప్పేందుకు అతను ఉదాహరణగా నిలిచాడు.

రజత్ పతీదార్‌కు దాదాపు సగం ఓట్లు వచ్చాయి, అయితే అతను RCB ఫ్రాంచైజీ తమ మొట్టమొదటి ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోవడంలో సహాయపడ్డాడు. ఈ అరంగేట్ర కెప్టెన్ తన బాధ్యతను అత్యంత తెలివిగా నిర్వహించి, ఆకట్టుకునే విధంగా 143.78 స్ట్రైక్‌రేట్‌ను పోస్ట్ చేశాడు. అతను తన టీమ్ సభ్యులలో ఆత్మవిశ్వాసం నింపగలిగాడు. అతను చూపిన ఈ దృఢత్వం కారణంగా, RCB రెగ్యులర్ సీజన్‌లో తాము ఆడిన ఎవే మ్యాచ్‌లను అన్నింటినీ గెలుచుకోగా, ఇది IPL చరిత్రలో నిలిచిపోయే ప్రత్యేకమైన ప్రదర్శనగా చెప్పాల్సిందే.

అభిమానుల ఓట్లలో సగానికి పైగా గెలుచుకున్న శ్రేయాస్ అయ్యర్, రెండవ స్థానంలో నిలిచిన రజత్ పతీదార్ కంటే ముందంజలో నిలిచాడు. ముంబై ఇండియన్స్‌కు చెందిన హార్దిక్ పాండ్యా, అభిమానుల ర్యాంకింగ్‌లో కాంస్య పతకం గెలుచుకుని, శుభ్‌మన్ గిల్‌ను వెనక్కు నెట్టాడు.

అభిమానుల అంచనాలను అందుకోనిది ఎవరు

ఈ సర్వేలో భాగంగా IPL 2025లో విఫలమయ్యారని తాము విశ్వసించే టాప్ 5 ప్లేయర్‌ల పేర్లను కూడా అభిమానులు తెలిపారు:

1. రిషబ్ పంత్ — 20%.

2. ఎంఎస్ ధోనీ — 9,2%

3. మహమ్మద్ షమీ — 5%.

4. హార్దిక్ పాండ్యా — 4.7%.

5. అభిషేక్ శర్మ — 4.6%.

డబ్బు అనేది క్రికెట్ ఆడదనే వాస్తవాన్ని, రిషబ్ పంత్ వేలం స్పష్టంగా నిరూపించింది. ₹27-28 కోట్ల విలువైన రికార్డు స్థాయి బదిలీ అనేది, ఈ కెప్టెన్‌ ఇంకా LSGకి ప్రధాన స్టార్‌పై తీవ్ర ఒత్తిడి కలిగించింది. సగటున, పంత్ 13-15 పరుగులను మాత్రమే స్కోర్ చేయగా, టీమ్ చూపిన మొత్తం ప్రదర్శనలో అతని సహకారం చాలా కొంచెం మాత్రమే. ఈ ఫలితంగా, ఖరీదైన వేలం నుండి ఆశించిన ప్రభావాన్ని లక్నో సూపర్ జెయింట్స్ అందుకోలేకపోయి, సీజన్‌లో 7వ స్థానంలో నిలవడంతో పాటుగా, ప్లేఆఫ్స్‌ను కూడా చేరుకోలేదు.

రిషబ్ పంత్‌ను విధ్వంసకర ఇన్నింగ్స్‌ను అభిమానులు అస్సలు చూడలేకపోయారు, బదులుగా అతను గేమ్‌లలో చాలా త్వరగానే ఔట్ అయిపోయాడు. అతనిలో నిలకడ లేకపోవడంతో పాటుగా, నాయకత్వ నిర్ణయాలలో కూడా అతను విశ్వాసం చూపలేకపోయాడు. అతను ఛాంపియన్‌షిప్ కంటే ముందే తీవ్రంగా అలసిపోయాడని, కీలకమైన మ్యాచ్‌లలో దారితప్పినట్లుగా కనిపించాడని కొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు.

అతిపెద్ద నిరుత్సాహకరం అనిపించిందంటూ దాదాపు సగం మంది ఎంఎస్ ధోనీకి ఓటు వేశారు, అయితే పంత్ వైఫల్యం మాదిరిగానే అతని ప్రదర్శ కూడా అతిపెద్ద నిరాశగా చెప్పుకోవాలి. ఇండియన్ క్రికెట్‌లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌ టైమ్‌కు అమోఘమైన ముంగిపును అభిమానులు ఆశించగా, వీడ్కోలు పలికేందుకు తగిన అత్యుత్తమ సమయాన్ని ఎంఎస్ ధోనీ కోల్పోయినట్లుగా కనిపించింది. గత కాలానికి చెందిన ధోనీతో పోల్చితే, అతను వాడిపోయిన నీడలా మాత్రమే కనిపిస్తున్నాడు.

అతని విస్తృత అనుభవం తనను విలువైన మెంటార్, వ్యూహకర్తగా నిలిపినా, తన జట్టు ఆటతీరుపై మాత్రమే ఎంఎస్ ధోనీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అతను చాలా ఆలస్యంగా, 8వ లేదా కొన్నిసార్లు 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతని ఫిట్నెస్‌పై, ప్రస్తుతం అతని మోకాలి సమస్యలపై అనేక సందేహాలు ఉన్నాయి. కెప్టెన్ ఈ స్థితిలో ఉండడంతో, CSK ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఏమాత్రం లేకపోయింది. ఎంఎస్ ధోనీ సమయం గడిచిపోయిందని, అతను ఉత్తమ స్థాయిలో ఆటను వదిలిపెట్టే అవకాశం దాదాపుగా లేకపోవడంతో, ఇక రిటైర్ కావడాన్ని పరిగణించాలని అభిమానులు విశ్వసిస్తున్నారు.

అతిపెద్ద నిరుత్సాహాలు మూడింటిలో మహమ్మద్ షమీ మూడవ స్థానంలో నిలిచాడు. సుదీర్ఘ కాలం పాటు, అతను భారత జాతీయ జట్టుకు అటాకింగ్‌కు ఒక చిహ్నంగా నిలిచాడు, అలాగే 2023 ప్రపంచ కప్‌లో హీరోగా నిలిచాడు, కానీ ఐపీఎల్ 2025లో మాత్రం అతను స్పష్టంగా విఫలమయ్యాడు. అతనికి గల చీలమండ గాయం కారణంగా, షమీ తన మునుపటి ఫామ్‌ను కోల్పోవడంతో తన ప్రధాన ఆయుధమైన బౌలింగ్‌ను ఏమాత్రం నియంత్రించలేకపోయాడు.

అదే సమయంలో, SRHకు అతని కొనుగోలు భారీ పెట్టుబడి అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఈ ఖర్చు ఆశించిన స్థాయిలో ప్రభావాన్ని అందించలేకపోయింది. అనేక మ్యాచ్‌లలో వరుసగా ఒక్కో ఓవర్‌కు 12 పరుగులకు పైగా సమర్పించుకున్నాడు. PBKSతో మ్యాచ్‌లో అతని ప్రదర్శన IPL చరిత్రలోనే అత్యంత దారణమైన వైఫల్యాలలో ఒకటిగా నిలిచింది, ఈ మ్యాచ్‌లో అతని గణాంకాలు 0/75గా ఉన్నాయి.

IPL 2025లో ఉత్తమ యువ ప్లేయర్‌లు

ఈ సీజన్ అంతటా యువ ప్రతిభావంతుల వెలుగులు విరజిమ్మే అరంగేట్రాలు, ఉత్సాహకర ప్రదర్శనలు కనిపించాయి. ఈ ప్లేయర్‌లను అభిమానులు ఎక్కువగా గుర్తుంచుకున్నారు:

1. సాయి సుదర్శన్ — 30,80%.

2. వైభవ్ సూర్యవంశీ — 29,80%.

3. ఆయుష్ మహాత్రే — 13,80%.

4. ప్రియాంష్ ఆర్య — 8,90%.

5. నూర్ అహ్మద్ — 3,20%.

6. ప్రభ్‌సిమ్రన్ సింగ్ — 2,30%.

7. హర్షిత్ రాణా — 2%.

8. విప్‌రాజ్ నిగమ్ — 1.60%.

9. అర్షిన్ కుల్‌కర్ణి — 0.90%.

10. ఇషాన్ కిషన్ — 0.90%.

వైభర్ సూర్యవంశీని సాయి సుదర్శన్ కేవలం 1 శాతం ఎక్కువ ఓట్లతో ఓడించి, అత్యుత్తమ యువ ప్లేయర్‌గా నిలిచాడు. గుజరాత్ తరఫున ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మ్‌యాన్ విజయానికి సూత్రంగా, ప్రతిభను అధిక స్ట్రైక్‌రేట్ (150కి పైగా)ను నిర్వహించడాన్ని చెప్పుకోవాలి. IPLలో 700 పరుగులకు పైగా ఒకే సీజన్‌లో సాధించిన, ఆరెంజ్ క్యాప్‌ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా సాయి సుదర్శన్ నిలిచాడు.

కేవలం 14 ఏళ్ల వయసులో, వైభవ్ సూర్యవంశీ IPL చరిత్రలోనే అతి చిన్న ప్లేయర్‌గా నిలవడంతో పాటు, సుదీర్ఘ అనుభవం ఉన్నవారి కంటే ఉత్తమమైన ఆటతీరు కనబరిచాడు. అతను 7 మ్యాచ్‌లను ఆడగా, 252 పరుగులు కొట్టాడు. అతనికి 206.56% అధిక స్ట్రైక్ రేట్ ఉంది.

అతను వయసులో చిన్నవాడైనా, వైభవ్ సూర్యవంశీ అత్యంత దూకుడుగా, నిర్భయంగా ఆడాడు. అతను మొదటి బంతి నుండే సిక్స్‌లను కొట్టడం అనేది, అతని విస్ఫోటకర ఆటతీరుకు ఉదాహరణగా చెప్పుకోవాలి. అతని సహజమైన ప్రతిభకు అనుభవం జోడయిన తరువాత, అతను పెద్ద మ్యాచ్‌లలో ఎలా ఆడగలడోననేది ప్రస్తుతానికి ఊహించుకోవాల్సిందే. రాజస్థాన్ రాయల్స్‌కు ఈ లీగ్‌లో అత్యంత విలువైన సుదీర్ఘ కాల ఆసెట్‌ దక్కిందని చెప్పాలి.

ఐపీఎల్ అంటేనే ఏమాత్రం అంచనా వేయలేని విధంగా, ఉద్వేగం అందించే లీగ్

IPL 2025 సీజన్‌లో అనేక ఉద్విగ్నభరిత మ్యాచ్‌లు, ఆశ్చర్యకర అంశాలు, ప్రత్యేకంగా నిలిచే వ్యక్తిగత ప్రదర్శనలను అందించిందని ఇండియా క్రికెట్ నెక్ట్స్‌ జెన్ అధ్యయన ఫలితాలు చాటుతున్నాయి. ఈ సీజన్‌లో కూడా అనేక హై-ప్రొఫైల్ అరంగేట్రాలు జరగడంతో, యువ ప్లేయర్‌లు అత్యంత త్వరగా అభివృద్ధి చెందుతున్నారు.

1xBetతో కలిసి IPLను, భారతీయ ప్రాంతీయ లీగ్‌లను ఫాలో చేసి, క్రికెట్ ప్రపంచంలో కొత్త దిగ్గజాలు ఎదిగే తీరును ఆస్వాదించండి.

1xBet గురించి

1xBet అనేది బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బుక్‌మేకర్. ఈ బ్రాండ్ కస్టమర్లు 70 భాషలలో అందుబాటులో ఉన్న కంపెనీ వెబ్‌సైట్, యాప్‌లలో వేలకొద్దీ క్రీడా ఈవెంట్‌లపై పందేలు వేయవచ్చు. 1xBet అధికారిక భాగస్వామి జాబితాలో FC Barcelona, Paris Saint-Germain, LOSC Lille, La Liga, Serie A, European CricketNetwork, Durban's Super Giantsతో పాటు ఇతర ప్రఖ్యాత క్రీడా బ్రాండ్‌లు, సంస్థలు కూడా ఉన్నాయి. ఇండియాలో కంపెనీ రాయబారులుగా ప్రముఖ క్రికెటర్‌ హెన్రిచ్‌ క్లాసీన్‌, నటి ఊర్వశి రౌతేలా ఉన్నారు. ఈ కంపెనీ IGA, SBC, G2E ఆసియా, EGR నార్డిక్స్ అవార్డ్స్ వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు అనేకసార్లు నామినీగా ఉండి, వాటిని గెలుచుకుంది కూడా.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 Playoff: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన బెంగళూరు.. పంజాబ్ కొంపముంచిన ఓటమి, చెన్నైకి బూస్ట్!
ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!