అప్పటిలాగే ఇప్పుడు కూడా... ఐపీఎల్ ముగిసిన తర్వాత పీఎస్‌ఎల్ పున:ప్రారంభం...

By team teluguFirst Published Apr 11, 2021, 4:46 PM IST
Highlights

జూన్ 1న తిరిగి ప్రారంభం కానున్న పీఎస్‌ఎల్...

జూన్ 20న పాక్ సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్...

2021 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ ముగిసిన తర్వాత పీఎస్‌ఎల్...

ఆర్భాటాలకు పోయి 2021 సీజన్ పాక్ సూపర్ లీగ్‌ను ప్రారంభించింది పాక్ క్రికెట్ బోర్డు. అయితే ప్లేయర్లు కరోనా బారిన పడుతుండడంతో అర్ధాంతరంగా లీగ్‌ను మధ్యలోనే నిలిపివేసింది పీసీబీ. ఎట్టకేలకు పాక్ సూపర్ లీగ్ తిరిగి ప్రారంభమయ్యే తేదీని ఖరారు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...

ఇండియన్ సూపర్ లీగ్ 2021 సీజన్ ముగిసిన తర్వాత జూన్ 1న తిరిగి పాక్ సూపర్ లీగ్ తిరిగి ప్రారంభం కానుంది. జూన్ 20న పీఎస్ఎల్ ఫైనల్ జరగనుంది. 2020 సీజన్ సమయంలో కూడా ఐపీఎల్ ముగిసిన తర్వాత పీఎస్‌ఎల్ ప్రారంభమైంది.

ఇక్కడి నుంచి నేరుగా డుప్లిసిస్ వంటి ప్లేయర్లు, నేరుగా పాక్ సూపర్ లీగ్‌లో పాల్గొన్నారు. పాక్ సూపర్ లీగ్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన పాక్ జాతీయ జట్టులో 11 మంది ప్లేయర్లు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.
 

click me!