icc world cup 2023 : ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ -న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే..?

Siva Kodati |  
Published : Sep 21, 2023, 02:53 PM IST
icc world cup 2023 : ఉప్పల్ స్టేడియంలో పాకిస్తాన్ -న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్.. ప్రేక్షకులు లేకుండానే..?

సారాంశం

ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 29న పాకిస్తాన్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరగాల్సి వుంది. అయితే భద్రతా కారణాలతో ఈ మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని హెచ్‌సీఏ భావిస్తోంది. 

ఉప్పల్ స్టేడియంలో వన్డే వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. ఈ నెల 29న పాకిస్తాన్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ జరగాల్సి వుంది. అయితే ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీతో మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని పోలీసులు తేల్చి చెప్పేశారు. దీంతో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ నిర్వహించాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. బీసీసీఐ నిర్ణయం కోసం హెచ్‌సీఏ ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికే వార్మప్ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ టికెట్ల విక్రయాలు ప్రారంభించింది. 
 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?