డి కాక్ మరో హాఫ్ సెంచరీ... 34 పరుగులు చేసిన కృనాల్ పాండ్యా...
రెండు వికెట్లు తీసిన షమీ...
IPL 2020: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 9 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 7, హార్ధిక్ పాండ్యా 8 పరుగులకి అవుట్ కాగా క్వింటర్ డి కాక్ మరో హాఫ్ సెంచరీ బాదాడు.
కృనాల్ పాండ్యా 30 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్స్తో 34 పరుగులు చేయగా, 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసి అవుట్ అయ్యాడు క్వింటన్ డి కాక్. 119 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ఓ దశలో 150 స్కోరైనా చేస్తుందా అనిపించింది. అయితే పోలార్డ్, కల్టర్ నైల్ మెరుపులతో భారీ స్కోరు చేయగలిగింది ముంబై ఇండియన్స్.
పోలార్డ్ 12 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 34 పరుగులు చేయగా, కల్టర్ నైల్ 12 బంతుల్లో 24 పరుగులు చేశాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ, ఆర్ష్దీప్ సింగ్ రెండేసి వికెట్లు తీయగా రవి బిష్ణోయ్, జోర్డాన్ చెరో వికెట్ తీశారు.