
న్యూజిలాండ్ ఆల్రౌండర్ జిమ్మీ నీశమ్, సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటాడు. ఫన్నీ ఫన్నీ పోస్టులతో, ఫన్నీ కామెంట్లతో నెటిజన్లను ఆకట్టుకునే జిమ్మీ నీశమ్... మరోసారి ఓ ఫన్నీ పోస్టుతో ఐపీఎల్ ఫ్యాన్స్ను కడుపుబ్బా నవ్వించాడు.
గత సీజన్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన జెమ్స్ నీశమ్ను, ముంబై ఇండియన్స్ బేస్ ప్రైజ్కి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పటిష్టమైన ప్లేయర్లతో నిండిన ముంబై ఇండియన్స్, జేమ్స్ నీశమ్కి ఇప్పటిదాకా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు.
దీంతో చెన్నైలో తన సహచర ఆటగాడు క్రిస్లీన్తో కలిసి సర్ఫింగ్ చేశాడు జేమ్స్ నీశమ్. సర్ఫింగ్ చేస్తున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన జేమ్స్ నీశమ్... ‘ఐపీఎల్ 2021 ఇప్పటిదాకా ఎలా ఉందంటే... నీళ్లు మోస్తున్నా... లేదంటే నీళ్లపైన తేలుతున్నా’ అంటూ కామెంట్ జత చేశాడు.