ఐపిఎల్ 2021: రాజస్థాన్ రాయల్స్ కు మరో ఎదురుదెబ్బ

By telugu teamFirst Published Apr 21, 2021, 9:42 AM IST
Highlights

ఐపిఎల్ 2021 టోర్నీలో రాజస్తాన్ రాయల్స్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లియామ్ లివింగ్ స్టోన్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఐపిఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఐపిఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో ఆటగాడు ఐపిఎల్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఐపిఎల్ 2021 నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు లియామ్ లివింగ్ స్టోన్ తప్పుకున్నాడు. స్వదేశం ఇంగ్లండుకు వెళ్లిపోయాడు.

ఆ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. లియామ్ లివింగ్ స్టోన్ గత రాత్రి స్వదేశానికి వెళ్లిపోయాడని, ఏడాది కాలంగా బయోబబబుల్ లో ఉండలేక ఆ నిర్ణయం తీసుకున్నాడని, అతని పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని, అందుకే అతడి నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, అతనికి ఏ విధమైన మద్దతు అవసరమైనా తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని ప్రకటించింది.

ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో రాజస్థాన్ ఫ్రాంచేజీ లివింగ్ స్టోన్ ను కనీస ధర రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడింది. తుది జట్టులో అతనికి స్థానం దక్కలేదు. 

ఇక మరో ఆటగాడు జోఫ్రా అర్చర్ ఇప్పటికే జట్టు నుంచి వైదొలిగాడు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే అతడి చేతికి సర్జరీ జరిగింది. దీంతో ఇప్పటి వరకు అతను టోర్నీకు దూరంగానే ఉన్నాడు.

 

Liam Livingstone has flown back home late last night, due to bubble fatigue accumulated over the past year. We understand and respect his decision, and will continue supporting him in any way we can. pic.twitter.com/stYywf3tBW

— Rajasthan Royals (@rajasthanroyals)
click me!