2021 సీజన్‌లో రంజీ ట్రోఫీ రద్దు... 87 ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా రంజీ ట్రోఫీకి బ్రేక్...

Published : Jan 30, 2021, 01:18 PM IST
2021 సీజన్‌లో రంజీ ట్రోఫీ రద్దు... 87 ఏళ్ల తర్వాత మొట్టమొదటి సారిగా రంజీ ట్రోఫీకి బ్రేక్...

సారాంశం

1892లో భారతదేశంలో రంజీ ట్రోఫీ ఆరంభం... ఇప్పటికే కేవలం రెండు సార్లు మాత్రం రంజీ సీజన్‌కి బ్రేక్... కరోనా రూల్స్, బిజీ షెడ్యూల్ కారణంగా రంజీ ట్రోఫీని నిర్వహించలేమన్న బీసీసీఐ...

కరోనా కారణంగా ఈ ఏడాది నిర్వహించాల్సిన రంజీ ట్రోపీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. 129 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉన్న రంజీ క్రికెట్ టోర్నీ చరిత్రలో దేశవాళీ లీగ్ రద్దు కావడం ఇది మూడోసారి. 1892లో భారతదేశంలో రంజీ ట్రోఫీ ఆరంభమైంది.

1930-31, 1933-34 సమయంలో దేశంలో స్వాతంత్రోద్యమం నడుస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా రంజీ సీజన్‌కి బ్రేక్ పడింది. 1934 తర్వాత రంజీ ట్రోఫీకి బ్రేక్ పడడం ఇదే తొలిసారి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయాల్లో కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీలను నిర్వహించిన ఏకైక దేశం భారత్.

అలాంటిది ఈసారి కరోనా రూల్స్, బిజీ షెడ్యూల్ కారణంగా రంజీ ట్రోఫీ నిర్వహించలేమని చేతులేత్తేసింది బీసీసీఐ. అయితే విజయ్ హాజరే ట్రోఫీ మాత్రం నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేసింది బీసీసీఐ. భారత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకునేందుకు రంజీ ట్రోఫీ ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటారు సెలక్టర్లు. 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma: హిట్ మ్యాన్‌కు లాస్ట్ వార్నింగ్.. ఇంగ్లాండ్‌లో కొడితే ఓకే.. లేదంటే ప్యాకప్? బీసీసీఐ షాకింగ్ ప్లాన్
Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? నెట్ ప్రాక్టీస్‌లో బయటపడ్డ అసలు సీన్ !