బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మే 18-24 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడటానికి అనుమతి ఇచ్చిందని మీడియాకు తెలిపింది.
శనివారం షార్జాలో యూఏఈతో జరిగే తొలి టి20 మ్యాచ్ తర్వాత ముస్తాఫిజుర్ భారత్కు వెళ్లనున్నట్లు బీసీబీ ధ్రువీకరించింది.
ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్లకు అందుబాటులో లేని ఆస్ట్రేలియా ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్ స్థానంలో ముస్తాఫిజుర్ను బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.
2016లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్, 2022, 2023 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. 2022లో ఎనిమిది మ్యాచ్లలో ఎనిమిది వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత సీజన్లో రెండు మ్యాచ్లు ఆడాడు.
29 ఏళ్ల ముస్తాఫిజుర్ ఇప్పటివరకు 38 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 38 వికెట్లు తీసుకున్నాడు. లీగ్లో వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన అతను ఇన్నింగ్స్లో అన్ని దశల్లోనూ ప్రభావవంతంగా బౌలింగ్ చేసేందుకు పేరు తెచ్చుకున్నాడు.
బంగ్లాదేశ్ తరఫున 106 టి20ల్లో 132 వికెట్లు తీసిన ముస్తాఫిజుర్, వైట్ బాల్ క్రికెట్లో అగ్రశ్రేణి లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా నిలిచాడు. దేశీయ, అంతర్జాతీయ టి20ల్లో 281 మ్యాచ్లలో 351 వికెట్లు తీసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ స్టార్క్ మిగిలిన ఐపీఎల్ 2025 సీజన్కు భారత్కు రావడం లేదని ESPNcricinfo తెలిపింది. ఈ సీజన్లో 11 మ్యాచ్లలో 14 వికెట్లు తీసిన స్టార్ కు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఫాఫ్ డుప్లెసిస్, ట్రిస్టాన్ స్టబ్స్ భారత్కు తిరిగి వస్తున్నట్లు ధ్రువీకరించారు. అయితే, స్టబ్స్ లీగ్ దశకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్ కోసం వెళ్తాడు.