ఐపీఎల్ 2020: చెన్నైలో ధోనీకి ధూమ్ ధామ్ స్వాగతం

By telugu teamFirst Published Mar 2, 2020, 12:52 PM IST
Highlights

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి చెన్నైలో ఘన స్వాగతం లభించింది. ధోనీ సోమవారంనాడు చెన్నైకి చేరుకున్నాడు. ధోనీకి స్వాగతం చెప్పిన వీడియోను సిఎస్కే తన ట్విట్టర్ లో పోస్టు చేసింది.

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చెన్నైలో సోమవారం ఘన స్వాగతం లభించింది. ఐపీఎల్ 2020 ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ సోమవారం చెన్నై చేరుకున్నారు. ఐపీఎల్ టీ20కి జట్టును సంసిద్ధం చేయడానికి ఆయన చెన్నై వచ్చారు. 

38 ఏళ్ల ధోనీకి స్వాగతం చెబుతున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. వీడియోను పోస్టు చేస్తూ దానికి కామెంట్స్ ను జత చేసింది.

శిక్షణా శిబిరాన్ని మార్చి 19 తర్వాత ప్రారంభిస్తామని చెన్నై సూపర్ కింగ్స్ గతవారం చెప్పింది. అయితే, ధోనీ మాత్రం సోమవారంనాడే చెన్నైకి చేరుకున్నారు 

 

Every goose shall bump with First Day First Show feels! Just ! 🦁💛 pic.twitter.com/DpQBIqahZe

— Chennai Super Kings (@ChennaiIPL)

2019లో న్యూజిలాండ్ పై ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో భారత్ ఓడిపోయిన తర్వాత ధోనీ భారత జట్టు తరఫున మైదానంలోకి దిగలేదు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లతో సిరీస్ లకు ఆయన దూరమయ్యాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లతో జరిగిన సిరీస్ ల్లో కూడా అతను పాల్గొనలేదు. 

శుక్రవారంనాడు ధోనీ రాంచీలోని డియోరీ మా ఆలయంలో పూజలు చేశాడు. క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్న ధోనీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ తన అభిమానులను ఉత్సాహపరస్తూనే ఉన్నాడు. 

2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ కు నాయకత్వం వహిస్తున్నాడు. 2010, 2011, 2018ల్లో ఆయన చెన్నైకి మూడు టైటిళ్లు అందించారు. మార్చి 29వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో జరిగే తొలి మ్యాచులో చెన్నై తలపడుతుంది. ఐపిఎల్ ఫైనల్ మే 24వ తేదీన జరుగుతుంది.

click me!