6 బంతుల్లో 6 సిక్సర్లు.. ఆంధ్ర క్రికెట‌ర్ వంశీకృష్ణ సంచ‌ల‌న బ్యాటింగ్.. వీడియో !

Published : Feb 22, 2024, 10:08 AM IST
6 బంతుల్లో 6 సిక్సర్లు.. ఆంధ్ర క్రికెట‌ర్ వంశీకృష్ణ సంచ‌ల‌న బ్యాటింగ్..  వీడియో !

సారాంశం

Vamsi Krishna: కడపలో జరిగిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో రైల్వేస్ స్పిన్నర్ దమన్ దీప్ సింగ్ వేసిన ఓవర్ లో ఆంధ్రాకు చెందిన వంశీకృష్ణ వ‌రుస‌గా 6 సిక్సర్లు బాదాడు. ధనాధన్ ఇన్నింగ్స్ తో సెంచరీ కొట్టాడు.    

Vamsi Krishna - six sixes in an over : ఆంధ్ర‌ప్లేయ‌ర్ ఎం వంశీకృష్ణ సంచ‌ల‌న ఇన్నింగ్స్ ఆడాడు. ఒకే ఓవ‌ర్ లో వ‌రుస‌గా ఆరు సిక్స‌ర్లు బాదాడు. దీంతో దిగ్గ‌జ ప్లేయ‌ర్ల స‌ర‌స‌న చేరాడు. ఇప్ప‌టివ‌ర‌కు న‌లుగురు భార‌త క్రికెట‌ర్లు మాత్ర‌మే వివిధ క్రికెట్ టోర్నీల‌లో ఒకే ఓవ‌ర్ లో వ‌రుస‌గా ఆరు సిక్స‌ర్లు బాదారు.

వివ‌రాల్లోకెళ్తే.. సీకే నాయుడు ట్రోఫీ టోర్నమెంట్‌లో రైల్వే జట్టుపై భారత బ్యాట్స్‌మెన్ ఎం వంశీ కృష్ణ ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఆడుతున్నాడు. ఈ క్ర‌మంలోనే ఒకే ఓవ‌ర్ లో వ‌రుస‌గా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 378 పరుగులు చేసింది. వంశీకృష్ణ 64 బంతుల్లో 110 పరుగుల‌తో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం రైల్వేస్ 9 వికెట్ల నష్టానికి 865 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కానీ, ఈ మ్యాచ్ డ్రా అయింది. ఈ మ్యాచ్‌లో వంవీకృష్ణ వరుసగా ఆరు సిక్సర్లు బాది భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్లు యువరాజ్ సింగ్, రవిశాస్త్రిల స‌ర‌స‌న చేరాడు.

విరాట్ కోహ్లీ కొడుకు పేరు 'అకాయ్' అంటే అర్థమేంటో తెలుసా?

 

ఈ మ్యాచ్ లో ఆంధ్రాకి చెందిన వికెట్ కీపర్ వంశీకృష్ణ 9 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేశాడు. అలాగే, ఏ ధరణి కుమార్ 108 బంతుల్లో 81 పరుగులు (10 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎ వెంకట రాహుల్ అజేయంగా 66 పరుగులు (7 ఫోర్లు) చేశారు. రైల్వేస్ ఎస్ ఆర్ కుమార్ (3-37), ఎం జైస్వాల్ (3-72), ధమన్‌దీప్ సింగ్ (2-137) వికెట్లు తీశారు. ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా వంశీకృష్ణ నిలిచాడు. గతంలో రవిశాస్త్రి (1985), యువరాజ్ సింగ్ (2007), రీతురాజ్ గైక్వాడ్ (2022) ఈ ఘనత సాధించారు.

బ్యాటింగ్‌లో రైల్వేస్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అన్ష్ యాదవ్ 268 పరుగులు చేశాడు. రవి సింగ్ 258 పరుగులు చేసి అతనికి మంచి సహకారం అందించాడు. రవి సింగ్ ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. అంచిత్ యాదవ్ కూడా 133 పరుగులు చేశాడు. శివమ్ గౌతమ్ (46), తౌఫిక్ ఉద్దీన్ (87), కెప్టెన్ పూర్ణాంక్ త్యాగి (36) బాగా ఆడారు. రైల్వే 231 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 865 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య.. చిక్కుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ క్రికెటర్‌ !

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : టీమిండియాకు బిగ్ షాక్
IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !