పేపర్, సీజర్స్ , రాక్స్.. రాహుల్ తో జిమ్మీ నీషమ్ ఫన్నీ ఫోటో.. నెట్టింట వైరల్

By telugu teamFirst Published Feb 12, 2020, 12:39 PM IST
Highlights

రాహుల్ బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా జిమ్మీ అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదన మొదలైంది. అయితే ఫీల్డ్ అంపైర్ ఎంటరై వారి వాదనను సద్దుమణిగించారు. వారు గొడవ పడుతుండగా తీసిన ఓ ఫోటోని తాజాగా జిమ్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఆ ఫోటోకి పేసర్, సీజర్స్ ,రాక్స్ అంటూ క్యాప్షన్ జత చేశాడు.

పేపర్, సీజర్స్ , రాక్స్ ఈ గేమ్ చిన్నప్పుడు చాలా మంది ఆడే ఉంటారు. ఇప్పుడు ఈ గేమ్ ని న్యూజిలాండ్ క్రికెటర్ జిమ్మీ నీషమ్ మరోసారి మనకు గుర్తు చేశారు. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ని ట్యాగ్ చేస్తూ... జిమ్మీ ఈ ఆటను గుర్తు చేయడం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... ఇటీవల టీమిండియా, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోసం తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. చివరి వన్డే మ్యాచ్ లో కేఎల్ రాహుల్, జిమ్మీ నీషమ్ లు తలపడ్డారు. వారి మధ్య చిన్నపాటి ఘర్షణ కూడా చోటుచేసుకుంది. 

Also Read టీమిండియా చాలా స్ట్రాంగ్, ఈ విజయం అద్భుతం.. ఆనందంలో విలియమ్సన్...

రాహుల్ బ్యాటింగ్ సమయంలో పరుగు తీస్తుండగా జిమ్మీ అడ్డుకున్నాడు. దీంతో వాగ్వాదన మొదలైంది. అయితే ఫీల్డ్ అంపైర్ ఎంటరై వారి వాదనను సద్దుమణిగించారు. వారు గొడవ పడుతుండగా తీసిన ఓ ఫోటోని తాజాగా జిమ్మీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఆ ఫోటోకి పేసర్, సీజర్స్ ,రాక్స్ అంటూ క్యాప్షన్ జత చేశాడు.

Paper, scissors, rock? 😂 pic.twitter.com/PFrK8ZcF9k

— Jimmy Neesham (@JimmyNeesh)

 

నిజంగా ఆ ఫోటో చూస్తే.. వాళ్లు గొడవ పడుతున్నట్లు ఉండదు.. ఈ పేపర్, సీజర్స్ ,రాక్స్ గేమ్ ఆడుతున్నట్లుగానే ఉంటుంది. అంతేకాకుండా.. రాహుల్ ని ట్యాగ్ చేస్తూ.. ఏప్రిల్ వరకు కొన్ని పరుగులు దాచిపెట్టుకో అంటూ మరో ట్వీట్ చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రాహుల్‌, నీషమ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి విదితమే. ఈ తరుణంలోనే నీషమ్‌ పై విధంగా ట్వీట్‌ చేశాడు. కాగా.. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే.. న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కోహ్లీ సేన ఘోరంగా విఫలమైంది. మూడు మ్యాచ్ లు ఓడిపోయింది. టీ20 సిరీస్ ఓడిన న్యూజిలాండ్... ఈ వన్డే సిరీస్ తో పగ తీర్చుకున్నట్లయ్యింది. కోహ్లీ సేనను వైట్ వాష్ చేసేసింది. 

click me!