బాపట్లలో యువకుడి ఆత్మహత్య, పోలీసులపై ఆరోపణలు... డిజిపి సీరియస్

Arun Kumar P   | Asianet News
Published : Apr 03, 2020, 10:32 AM IST
బాపట్లలో యువకుడి ఆత్మహత్య, పోలీసులపై ఆరోపణలు... డిజిపి సీరియస్

సారాంశం

బాపట్లలో యువకుడి ఆత్మహత్యపై ఏపి డిజిపి సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై విచారణకు ఆదేశించారు. 

ప్రకాశం జిల్లా బాపట్లలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక పోలీస్ స్టేషన్లోనే చెట్టుకు ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యకు ముందు సదరు యువకుడు తీసుకున్న సెల్పీ వీడియో సంచలనంగా మారింది. ఈ ఘటనలో పోలీసుల వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో డిజిపి గౌతమ్ సవాంగ్ స్పందించారు.   

బాపట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలోనే యువకుడు అత్మహత్య చేసుకోవడంపై రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమంలో వస్తున్న వార్తలపై స్పందించిన డీజీపీ తక్షణమే ఈ సంఘటన పై విచారణకు ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని గుంటూరు ఐజీని ఆదేశించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్ డౌన్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. బాపట్లలో దీని కారణంగా శ్రీనివాస్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చిత్తూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 

రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించడంతో అతను కృష్ణా జిల్లాలోని తన స్వస్థలానికి బైక్ పై బయలుదేరాడు. అయితే బాపట్లలో అతని బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అతను తన ఆత్మహత్యకు గల కారణాన్ని వివరిస్తూ సెల్ఫీ రికార్డు చేశాడు. తన ఆత్మహత్యకు పోలీసులను నిందించాడు.

బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బాపట్లలో తనను పోలీసులు నిలిపేసి బైక్ ను స్వాధీనం చేసుకున్నారని, ఆ తర్వాత తనను బాపట్ల బస్ స్టాండులో వదిలేశారని అతను చెప్పాడు. పోలీసులు బాధ్యత లేకుండా వ్యవహరించారని అతను విమర్శించాడు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. గురువారంనాడు గత 9 గంటల వ్యవధిలో మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ రోజు కొత్తగా 32 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది. తాజాగా కృష్ణా జిల్లాలో 8 కేసులు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. 

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొన్నవారికే ఎక్కువగా కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారి వల్ల వారి కుటుంబ సభ్యులకు ఇతరులకు పాకుతోంది. 
 

PREV
click me!

Recommended Stories

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి