‘ఎయిర్ ఇండియా’పై వచ్చిన మీడియా కథనాల్లో నిజం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Published : Oct 01, 2021, 07:12 PM IST
‘ఎయిర్ ఇండియా’పై వచ్చిన మీడియా కథనాల్లో నిజం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

సారాంశం

ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌లో దాఖలు చేసిన బిడ్‌ను టాటా సన్స్ గెలుచుకుందని, ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుందని కొన్ని కథనాలు వచ్చాయి. టాటా సన్స్ బిడ్‌ను కేంద్ర మంత్రుల ప్యానెల్ ఆమోదించిందనీ పేర్కొన్నాయి. అయితే, ఆ వార్తల్లో నిజం లేదని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు తప్పకుండా తెలియజేస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వైమానిక సంస్థ ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారిని ఆహ్వానించింది. టాటా సన్స్, స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ సహా పలువురు బిడ్లు వేశారు. ఈ నేపథ్యంలోనే టాటా సన్స్ బిడ్ గెలుచుకున్నారని, ఎయిర్ ఇండియాను వ్యవస్థాపించిన సంస్థనే 68ఏళ్ల తర్వాత మళ్లీ దాన్ని చేజిక్కించుకుందనే వార్తలు వచ్చాయి. టాటా సన్స్ ఎయిర్‌ ఇండియా సొంతం చేసుకుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని, టాటా బిడ్‌ను మంత్రుల ప్యానెల్ ఆమోదించిందనేది ఆ కథనాల సారంశం. ఈ కథనాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌పై మీడియాలో వచ్చిన కథనాల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

 

ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌లో దాఖలైన ఫైనాన్షియల్ బిడ్లను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సూచిస్తూ వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఈ సంస్థ డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే తప్పకుండా మీడియాకు తెలియజేస్తామని వివరించింది. డిపమ్ సెక్రెటరీ ట్విట్టర్ హ్యాండిల్ ఈ వివరణ ఇచ్చింది.

PREV
click me!

Recommended Stories

Bank Account: మీకు శాల‌రీ అకౌంట్ ఉందా.? అయితే మీకు మాత్ర‌మే ఉండే బెనిఫిట్స్ ఏంటో తెలుసా?
New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!