స్టాక్ మార్కెట్ సెన్సేషన్: వరుసగా 2వ రోజు రికార్డు.. సెన్సెక్స్ 212 పాయింట్లు, 20,750 దాటిన నిఫ్టీ..

By asianet news teluguFirst Published Dec 5, 2023, 10:20 AM IST
Highlights

ప్రస్తుతం సెన్సెక్స్ 297.70 (0.43%) పాయింట్ల లాభంతో 69,190.86 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 101.11 (0.49%) పాయింట్లు బలపడి 20,787.90 వద్ద కొనసాగుతోంది.  
 

స్టాక్ మార్కెట్‌లో సోమవారం బంపర్ పెంపు  తర్వాత, మంగళవారం కూడా రికార్డు స్థాయి పెరుగుదల కొనసాగుతోంది. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు కూడా వారంలోని రెండో ట్రేడింగ్ రోజున సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఈ సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 69,306, నిఫ్టీ 20,813 పాయింట్లను తొలిసారిగా అధిగమించాయి. 

ప్రస్తుతం సెన్సెక్స్ 297.70 (0.43%) పాయింట్ల లాభంతో 69,190.86 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 101.11 (0.49%) పాయింట్లు బలపడి 20,787.90 వద్ద కొనసాగుతోంది.  

Latest Videos

స్టాక్  మార్కెట్‌లో ఆల్ రౌండ్ కొనుగోళ్లలో బ్యాంకింగ్ రంగ షేర్లదే అత్యధిక సహకారం. బిఎస్‌ఇలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కూడా రికార్డు స్థాయి రూ.344 లక్షల కోట్లను దాటింది. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1383 పాయింట్లు లాభపడి 68,865 వద్ద ముగిసింది.

రిటైల్ వ్యాపారుల పెట్టుబడుల పెరుగుదల, విదేశీ ఇన్‌ఫ్లోలు భారతదేశ స్టాక్ మార్కెట్‌ను  ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఇంకా  మొదటిసారిగా $4 ట్రిలియన్ల వాల్యుయేషన్ అంచున ఉంచాయి.

బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, నేషన్స్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్  చేయబడిన సెక్యూరిటీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్చి 2020 కరోనా మహమ్మారి కనిష్ట స్థాయి నుండి మూడు రెట్లు పెరిగింది, దింతో సోమవారం నాటికి $4 ట్రిలియన్ మార్కుకు చేరువకి చేరుకుంది.

 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికార పార్టీ మూడు కీలకమైన రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత భారతదేశపు బెంచ్‌మార్క్ NSE నిఫ్టీ 50 ఇండెక్స్ సోమవారం 2.1% జంప్ చేసి ఆసియాలో ప్రధాన లాభాలను సాధించింది. 

ఈ విజయాలు వచ్చే ఏడాది దేశవ్యాప్త ఎన్నికలకు ముందు మోడీ స్థానాన్ని బలపరచడం ద్వారా పెట్టుబడిదారులకు రాజకీయ ప్రమాదం తొలగించాయి. 

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పెట్టుబడిదారులకు ఇంకా  కంపెనీలకు చైనాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నందున భారతదేశ స్టాక్ మార్కెట్‌కు ఈ ఘనత వచ్చింది.

click me!