Budget 2020: బడ్జెట్ ముందు ఆర్బిఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు...

Ashok Kumar   | Asianet News
Published : Jan 25, 2020, 11:35 AM ISTUpdated : Jan 25, 2020, 11:36 AM IST
Budget 2020: బడ్జెట్ ముందు ఆర్బిఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు...

సారాంశం

ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వృద్ధిని పునరుద్ధరించడానికి మరింత నిర్మాణాత్మక సంస్కరణల అవసరాన్ని నొక్కి చెప్పారు.వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలను అమలు చేయాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. 

మరో వారం రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సమయంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ చివరికి స్పందించారు.  ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వృద్ధిని పునరుద్ధరించడానికి మరింత నిర్మాణాత్మక సంస్కరణల అవసరాన్ని నొక్కి చెప్పారు.వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలను అమలు చేయాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.

also  read బ్యాంకుల సమ్మె... కస్టమర్లను అలర్ట్ చేసిన ఎస్‌బి‌ఐ...

ఢిల్లీలోని జరిగిన ఒక కార్యక్రమంలో శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ వినియోగ డిమాండ్‌, వృద్ధి రేటును పెంచే విధంగా సంస్కరణలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.ఫిబ్రవరి, డిసెంబర్ మధ్య ఆర్‌బిఐ జిడిపి అంచనాను 290 బిపిఎస్‌ల ద్వారా 5 శాతం తక్కువకు  తగ్గించవలసి వచ్చింది.

వృద్ది తదితర లక్ష్యాలను సాధించడానికి ద్రవ్య పాలసీకి పరిమితులు ఉన్నాయని ఆయన అన్నారు. ఏ రంగంలో సంస్కరణలు చేపట్టాల్లో విశ్లేషిస్తున్నామని అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా బడ్జెట్‌ ఉంటుందని అభిప్రాయపడ్డారు. రిజర్వ్ బ్యాంక్ గట్టి ద్రవ్య విధానాన్ని పరిశీలిస్తుందని, వడ్డీ రేట్ల తగ్గింపును ఫిబ్రవరి 5న జరిగే రివ్యూలో ఇవ్వకపోవచ్చని గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం సూచించారు.

రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు సంవత్సరాల గరిష్ట స్థాయి 7.3 శాతానికి పెరిగిందని అన్నారు. ఫిబ్రవరి 1న జరిగే కేంద్ర బడ్జెట్ కంటే ఒక వారం ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు కిలగంగా మారాయి. "అయితే, ద్రవ్య విధానానికి దాని స్వంత పరిమితులు ఉన్నాయి. నిర్మాణాత్మక సంస్కరణలు, ఆర్థిక చర్యలు కొనసాగించవలసి ఉంటుంది ”అని శక్తికాంత దాస్  ఒక కళాశాల విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.

also read ఎయిర్ ఏషియా ఉన్నతాధికారులకు సమన్లు ​​జారీ...

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, పర్యాటక రంగం, ఇ-కామర్స్, స్టార్టప్‌లు, గ్లోబల్ వాల్యూ చైన్‌లో భాగమయ్యే వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.  ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని పెంచే మౌలిక సదుపాయాల వ్యయంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తే వేగవంతమైన అభివృద్ధి సాధ్యమన్నారు.

2019-20లో దేశా ఆర్థిక వ్యవస్థ కేవలం 5% మాత్రమే వృద్ధి చెందుతుందని అధికారిక అంచనాలు సూచించిన కొన్ని వారాల తరువాత గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ద్రవ్యోల్భణానికి కారణమయ్యే అంశాలను నిరంతరం సమీక్షించి పరిష్కార మార్గాలను కనుగొనాలని అన్నారు. పాలసీల రూపకల్పనలో సర్వే, డాటాను విశ్లేషిస్తామని, అన్ని అంశాలను పరిశీలించి పాలసీల రూపకల్పన చేస్తామని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్