Petrol Diesel Prices Today: యుద్ధ ప్ర‌భావం.. నేడు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 25, 2022, 09:26 AM IST
Petrol Diesel Prices Today: యుద్ధ ప్ర‌భావం.. నేడు పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..?

సారాంశం

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో 100 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి.

అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్‌లో ఓ సమయంలో 100 డాలర్లు క్రాస్ చేసింది. అంతర్జాతీయంగా పెరిగినప్పటికీ, వంద రోజులు దాటిన తర్వాత కూడా భారత్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (ఫిబ్రవరి 25, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ధరలను సవరిస్తాయి. మూడు నెలలకు పైగా ధరల్లో మార్పులేదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి.

వివిధ న‌గ‌రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

- ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

- చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

- త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

- విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

- బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

- జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

- లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

- భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 102.10, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

- ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పూర్తిగా చెలరేగితే ముడి చమురు మరింత ప్రియంగా మారుతుంది. ముడి చమురు ధరలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ పరిశోధనా సంస్థల ప్రకారం.. ముడి చమురు ధర $100 కంటే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ముడి చమురు ధర మరింత పెరగవచ్చు. 2022లో ముడి చమురు బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్లు గోల్డ్‌మన్ శాక్స్‌ పేర్కొంది. అదే సమయంలో JP మోర్గాన్ 2022లో బ్యారెల్ ధర $ 125,  2023 లో $ 150 వరకు ఉంటుందని అంచనా వేసింది.

కాగా భారత్.. ప్రధానంగా పెట్రోల్, డీజిల్ కోసం ముడి చమురు దిగుమతులపైన ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అందువల్ల క్రూడ్ ధరలు అనేవి పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంకా డిమాండ్ పెరగడం, ప్రభుత్వ పన్నులు, రూపాయి డాలర్ విలువలో మార్పు, రిఫైనరీ కన్సప్చన్ రేషియో వంటి అంశాల వల్ల కూడా దేశీ ఇంధన ధరలపై ఎఫెక్ట్ ఉంటుంది.

PREV
click me!

Recommended Stories

Cheapest EV bike: చవక ధరకే ఏథర్ ఈవీ బైక్.. ఇలా అయితే ఓలాకు కష్టమే
Indian Railway: ఇక‌పై రైళ్ల‌లో ల‌గేజ్‌కి ఛార్జీలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన రైల్వే మంత్రి