stockmarket:భారీ పతనంతో ముగిసిన సెన్సెక్స్, కుప్పకూలిన నిఫ్టీ.. ఈ ఏడాదిలోనే అతిపెద్ద క్రాష్..

Ashok Kumar   | Asianet News
Published : Feb 24, 2022, 06:25 PM ISTUpdated : Feb 24, 2022, 06:47 PM IST
stockmarket:భారీ పతనంతో ముగిసిన సెన్సెక్స్, కుప్పకూలిన నిఫ్టీ..  ఈ ఏడాదిలోనే అతిపెద్ద క్రాష్..

సారాంశం

రష్యా, ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. దీంతో నేడు భారత స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు లేని అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2702 పాయింట్ల నష్టంతో ముగియగా, నిఫ్టీ 815 పాయింట్ల నష్టంతో ముగిసింది.     

రష్యా, ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్దం కారణంగా గురువారం భారత స్టాక్ మార్కెట్ కుదేలైంది. బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూడని అతిపెద్ద పతనంతో 2702 పాయింట్ల నష్టంతో  54,530 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచీ కూడా రోజంతా ఒడిదుడుకుల మధ్య 815 పాయింట్ల బలమైన క్షీణతతో 16,227 వద్ద ముగిసింది. 

ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్  1850 పాయింట్ల భారీ పతనంతో ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే కొంత సమయం తర్వాత కాస్త మెరుగుదల కనబరిచి, 1430 పాయింట్లకు తగ్గింది. కానీ రష్యా ఇంకా ఉక్రెయిన్ నుండి వార్తలు వెలువడటంతో షేర్ మార్కెట్ ట్రేడింగ్ క్షీణత తీవ్రమైంది. గతంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక్కరోజులో 2800 పాయింట్లు పడిపోయింది. నేడు ఈ పతనం కారణంగా తొమ్మిది లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువగా పెట్టుబడిదారులు మునిగిపోయారు. మరోవైపు, నిఫ్టీపై కూడా యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఉదయం 414 పాయింట్ల భారీ పతనంతో 16,648 వద్ద కనిష్ట స్థాయిలో ప్రారంభమైన నిఫ్టీ రోజంతా నష్టాలలో  ట్రేడైంది.

నేడు బ్యాంకింగ్ స్టాక్స్ అత్యధికంగా పడిపోయాయి, దీంతో వరుసగా ఆరవ రోజు కూడా పడిపోయాయి. బుధవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సెషన్‌ గ్రీన్ మార్క్‌తో ప్రారంభమైనప్పటికీ ప్రారంభ ర్యాలీని కొనసాగించలేక నష్టాలతో ముగిసింది. 30 షేర్ల సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 57,232 వద్ద ముగియగా, నిఫ్టీ 29 పాయింట్లు జారి 17,063 వద్ద ముగిసింది. గత ఆరు రోజులుగా షేర్ మార్కెట్ నిరంతరం నష్టాలలో  ముగుస్తోంది. 

టెక్ మహీంద్రా, టిసిఎస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌డిఎఫ్‌సి, ఎస్‌బిఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటిసి షేర్లు మూడు శాతం వరకు పడిపోగా. పవర్‌గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్, టైటాన్, నెస్లే, సన్ ఫార్మా, ఎన్‌టీపీవీసీ షేర్లు ఒక శాతం పడిపోయాయి. 
 

PREV
click me!

Recommended Stories

Bank Locker : బ్యాంక్ లాకర్‌లో బంగారం పెట్టారా? ఈ ఒక్క పని చేయకపోతే భారీ నష్టం
Most Expensive Metals: బంగారం కాదు.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మెటల్స్ ఇవే