రెపో రేటు యథాతధం చేసిన ఆర్‌బి‌ఐ

By Sandra Ashok KumarFirst Published Feb 6, 2020, 12:40 PM IST
Highlights

ఫిబ్రవరి 4న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించిన ఎంపిసి, రెపో రేటును, సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును, లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం (ఎల్ఎఎఫ్) కింద 5.15 శాతానికి పరిమితం చేసింది. 

ఆర్‌బిఐ ఎంపిసి సమావేశంలో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును యథాతధం చేసింది. సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాల రేటును  ప్రస్తుతం 5.15 శాతం ఉండగా దానిని ఎప్పటిలాగే కొనసాగించనుంది.  మార్కెట్ అంచనాలకు అనుగుణంగా, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగిన ఎంపిసి సమావేశంలో గురువారం తాజా ప్రకటనలో రెపో రేటును యథాతధంగా  కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

also read లింక్డ్ఇన్ సి‌ఈ‌ఓ జెఫ్ వీనర్ రాజీనామా...

ఫిబ్రవరి 4న మూడు రోజుల సమావేశాన్ని ప్రారంభించిన ఎంపిసి, రెపో రేటును, సెంట్రల్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు రుణాలు ఇచ్చే రేటును, లిక్విడిటీ సర్దుబాటు సౌకర్యం (ఎల్ఎఎఫ్) కింద 5.15 శాతానికి పరిమితం చేసింది. ఈ సంవత్సరంలో వరుసగా రెండవ సారి ఇది. ఎల్‌ఏ‌ఎఫ్  క్రింద రివర్స్ రెపో రేటు ఎప్పటిలాగే 4.90 శాతం ఉంచారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు 5.40 శాతం, బ్యాంక్ రేటు 5.40 శాతంగా కొనసాగించనున్నారు.

ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ షెడ్యూల్ చేసిన బ్యాంకుల నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్‌ఆర్) నికార డిమాండ్ ప్రస్తుతం ఉన్న 4 శాతంలో ఎలాంటి మార్పు లేదు.  ద్రవ్యోల్బణం పెరగడం వల్ల సెంట్రల్ బ్యాంక్ రేట్లు కలిగి ఉంటుందని చాలా మంది ఆర్థికవేత్తలు ఆశించారు. ఆర్థికవేత్తల పోల్ ప్రకారం అక్టోబర్ వరకు ఆర్బిఐ రెపో రేటును మార్చదు అని తెలిపింది.

also read వజ్రాలకు కరోనా వైరస్...వేల కోట్ల నష్టం!!

భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో ఐదేళ్ల గరిష్ట స్థాయి 7.35 శాతానికి పెరిగింది. ఇది నెల క్రితం 5.54 శాతంగా ఉంది. డిసెంబరులో జరిగిన సమావేశంలో ఆర్‌బి‌ఐ యథాతథ స్థితిని కొనసాగించింది. ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య కీలకమైన రెపో రేటును, బ్యాంకులకు ఇచ్చే రేటును 5.15 శాతానికి పరిమితం చేసింది.  

గత ఎంపిసి సమావేశంలో ఆర్‌బిఐ తన అక్టోబర్ సమావేశంలో సిపిఐ ద్రవ్యోల్బణ ప్రొజెక్షన్‌ను 2019-20 ద్వితీయార్థంలో 3.5-3.7 శాతం నుండి 5.1-4.7 శాతానికి సవరించింది. అంతకుముందు ఆర్‌బిఐ 2020 ఆర్థిక సంవత్సరానికి జిడిపి అంచనాను 6.1 శాతం నుండి 5 శాతానికి తగ్గించింది. ఆర్‌బిఐ అంచనాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 5 శాతం నెమ్మదిగా వృద్ధి చెందుతుందని ఎకనామిక్ సర్వే 2019-20లో అంచనా వేసింది.

click me!