
రిలయన్స్ రిటైల్, ఇండియన్ ఆయిల్-టు-కెమికల్స్ కాంగ్లోమరేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ సెలూన్ వ్యాపారంలోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ఇందుకు నేచురల్ సేలోన్ & స్పాలో దాదాపు 49% వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతోంది అని ఒక వార్తాపత్రిక శుక్రవారం నివేదించింది.
అయితే నేచురల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సికే కుమారవేల్ మాట్లాడుతూ, "చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయి," అని అన్నారు.
దేశవ్యాప్తంగా 700 నేచురల్ సెలూన్లను నడుపుతున్న గ్రూమ్ ఇండియా సెలూన్స్ & స్పా ప్రస్తుత ప్రమోటర్లు దీని కార్యకలాపాలను కొనసాగించవచ్చు అలాగే రిలయన్స్ ఫండ్స్ నెట్వర్క్ను విస్తరించడంలో సహాయపడతాయని ఒక నివేదిక పేర్కొంది.
అయితే ఈ డీల్ వాల్యు ఎంత అనేది పేర్కొనలేదు. దీనిపై నాచురల్స్ ఇంకా రిలయన్స్ నుండి ఎటువంటి స్పందన లేదు.
చెన్నైకి చెందిన నేచురల్స్ 2000ల ప్రారంభంలో స్థాపించారు, వెబ్సైట్ ప్రకారం, 2025 నాటికి 3వేల సెలూన్లను నిర్వహించాలని టార్గెట్ పెట్టుకుంది.
న్యాచురల్స్ లో వాటా కోసం రిలయన్స్ డీల్ ఫస్ట్ ఇన్-హౌస్ ప్రీమియం ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ స్టోర్ను ప్రారంభించిన కొద్ది వారాలకే వచ్చింది, అయితే మీడియా నివేదికలు LVMH యాజమాన్యంలోని బ్యూటీ చైన్ సెఫోరాకు భారతదేశ హక్కుల కోసం రిలయన్స్ అధునాతన చర్చలు జరుపుతున్నాయని పేర్కొంది.
COVID-19 మహమ్మారి సమయంలో సెలూన్లు అత్యంత దెబ్బతిన్న వ్యాపారాలలో ఒకటి. నేచురల్స్ సీఈఓ కుమారవేల్ మే 2020లో ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరారు. అయితే ప్రజలు సోషల్ ఈవెంట్స్ అండ్ ఆఫీసులకు ఎక్కువగా వెళ్లడం వలన సెలూన్ వ్యాపారం తిరిగి పుంజుకుంది.