పిఎంఎవై-జి పథకం కింద 1.75 లక్షల ఇళ్లను ప్రారంభింన ప్రధాని నరేంద్ర మోడీ

By Sandra Ashok KumarFirst Published Sep 14, 2020, 12:52 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘గ్రిహ్ ప్రవీష్’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడి పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

న్యూ ఢీల్లీ: భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవాస్ యోజన ప్రథకం కింద నిర్మించిన 1.75 లక్షల ఇళ్లను శనివారం ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘గ్రిహ్ ప్రవీష్’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడి పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మోడీ ప్రభుత్వం ఇచ్చిన కీలక వాగ్దానాల్లోని ఒకటైన “హౌసింగ్ ఫర్ అల్ 2022” నవంబర్ 2016న ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా 1.14 కోట్ల ఇళ్ళు నిర్మించినట్లు ప్రభుత్వం అంతకుముందు ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 17 లక్షల మంది పేద కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయి. ఇవన్నీ ఇల్లు లేని లేదా తాత్కాలిక గృహాలలో నివసించిన పేద ప్రజల కోసం నిర్మించిన గృహాలు.

also read హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లో కొత్తగా 14వేల మంది కరస్పాండెంట్ల నియామకం.. ...

పిఎమ్‌ఎవై-జి కింద, ప్రతి లబ్ధిదారునికి 100% గ్రాంట్ కింద కేంద్రం, రాష్ట్రం మధ్య 60:40 షేరింగ్ రేషియోతో రూ. 1.20 లక్షలు ఇవ్వనున్నారు. పిఎమ్‌ఎవై-జి కింద నిర్మించిన ఈ గృహాలన్నింటికీ నిధులు 4 వాయిదాల ద్వారా నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోకి చేరతాయి. ఈ పథకం 2022 నాటికి 2.95 కోట్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధాన్ మంత్రి ఉజ్జ్వాలా పథకం, విద్యుత్ కనెక్షన్, జల్ జీవన్ మిషన్ కింద సురక్షితమైన తాగునీటి సదుపాయం, ఎల్పిజి కనెక్షన్ అందించడానికి ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర / యుటిల ఇతర పథకాలతో కలవడానికి ఈ పథకంలో నిబంధనలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం “సమృద్ పరివాస్” ద్వారా అభియాన్ ”, అదనపు ప్రయోజనాలను అందించడానికి సామాజిక భద్రత, పెన్షన్ పథకం, రేషన్ కార్డు, ప్రధాన మంత్రి కౌషల్ వికాస్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వంటి 17 ఇతర పథకాలను డొవెటైల్ చేసింది.
 

click me!