భీమా బాయ్ కనబడుట లేదు. అభిమానులారా, కాస్త వెతికి పెట్టండి..

Published : Feb 28, 2023, 11:51 AM IST
భీమా బాయ్ కనబడుట లేదు. అభిమానులారా, కాస్త వెతికి పెట్టండి..

సారాంశం

భీమా బాయ్ ఇప్పుడు తప్పిపోయాడు. దోబూచులాటలో బీమా బాయ్ ఇప్పుడు కనిపించటం లేదు. దీంతో భీమా అభిమానులు ఇప్పుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడని అంతా వెతుకుతున్నారు. మరి దీనికి సంబంధించిన కథ కమామిషు ఏంటో తెలుసుకుందాం. 

ప్రముఖ జ్యువెలరీ దిగ్గజం భీమా గురించి తెలియని వారు ఉండరు.  భీమా షోరూం సందర్శించే వారికి భీమా బాయ్ సుపరిచితమే.  మరి ఆ భీమా బాయ్ ఇప్పుడు తప్పిపోయాడు. దోబూచులాటలో  ఆ బీమా బాయ్ ఇప్పుడు కనిపించటం లేదు. దీంతో భీమా అభిమానులు ఇప్పుడు అబ్బాయి ఎక్కడ ఉన్నాడని అంతా వెతుకుతున్నారు మరి దీనికి సంబంధించిన కథ కమామిషు ఏంటో తెలుసుకుందాం. 

బీమా భాయ్  అందరికీ సుపరిచితమైన పేరు, రెగ్యులర్ కస్టమర్లు అందరికీ తెలిసిన వాడే కావడం విశేషం. భీమా బాయ్ చివరిగా లక్ష్మీ మీనన్ నివాసంలో కనిపించాడు. ఆమె భీమాకు టీ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రీల్స్ రికార్డు చేద్దామని తయారవడానికి వెళ్లగా, అంతలోనే భీమా బాయ్ తప్పిపోయాడు. దీంతో లక్ష్మీ తనకు కుమార్తె తన్వితో కలిసి కొద్ది నిమిషాల సేపు అంతా కలియ తిరిగింది. కానీ భీమా బాయ్ మాత్రం కనిపించలేదు. 

ఈ సంగతి అన్ని ప్రాంతాల్లో వెంటనే తెలిసి పోయింది. అయితే ఒక వదంతి ఏమని వచ్చిందంటే, భీమా బాయ్ చివరగా కన్మణి అనే అమ్మాయిని కలిసి ఆమె పోగొట్టుకున్న రింగును తిరిగి ఇచ్చాడట, ఆ రింగును భీమా వద్దే కొనుగోలు చేసిందట. ఆ అమ్మాయి జరిగిన సంఘటనలను తన తాతయ్యకు చెప్పింది. అలాగే ఆమె ఎంతో ఆశ్చర్యపోయినట్లు తెలిపింది. అయితే భీమా బాయ్ గురించి ఆ పాపకు అంతా తెలియదు. కానీ ఆమె తాతయ్య మాత్రం భీమా చరిత్రను, కీర్తిని ఆమెకు తెలిపాడు. 

భీమా జువెలరీస్ ఒక ఘన చరిత్ర అనే చెప్పాలి. అలప్పుజా అనే పట్టణంలో ఒక చిన్న వెండి దుకాణంగా, భీమా జువెలరీ ప్రస్థానం మొదలైంది. సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మీ నారాయణన్ ఉడిపికి చెందిన కురుప్పన్న భట్టర్, ఆయన భార్య మహాలక్ష్మీలకు జన్మించాడు. తన తండ్రి మరణంతో, కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ సమయంలోనే లక్ష్మీ నారాయణన్ తన ఆకలిని తీర్చుకునేందుకు మజ్జిగలో అన్నం కలుపుకొని తాగే వాడు. దాని పేరు భీమన్ అని పెట్టుకున్నాడు. అలెప్పీలో ఉండే బావ వద్దకు చేరుకొని అక్కడే లక్ష్మీనారాయణ్ పెరిగి పెద్దవాడయ్యాడు. 
   
చిన్నతనంతో భీమా భట్టర్ గా పిలవబడిన లక్ష్మీ నారాయణ, వెండి వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన భార్య కాళ్ల పట్టీలను విక్రయించి, వ్యాపారం ప్రారంభించారు. చేసే పనిలో సృజనాత్మకత, స్వచ్ఛతను నమ్ముకున్నారు. దీంతో ఆయనకు వ్యాపారంలో విజయం వరించింది. నెమ్మదిగా ఫేమస్ అవడం ప్రారంభించారు. వ్యాపారంలో నిబద్ధతోనూ, నాణ్యత విషయంలోనూ ఎలాంటి రాజీ పడకుండా ముందుకు సాగారు. ఫలితంగా విజయం వారిని వరించింది. తక్కువ లాభంతో నాణ్యత పైనే దృష్టి పెట్టి భీమా జ్యువెలర్స్ ఒక ప్రతిష్టాత్మక బ్రాండ్ గా నిలిచిపోయింది.  సంవత్సరాలు గడిచే కొద్దీ భీమా జ్యువెలర్స్ కీర్తి పతాక నలు దిశలా వ్యాపించింది. 

భీమా జువెలరీస్ కేరళలో బంగారం నగల వ్యాపారానికి సరికొత్త మార్గం చూపించింది. ముఖ్యంగా కస్టమర్లతో అనుబంధం పెనవేసుకొని వ్యాపారంలో కొత్త ఒరవడి సృష్టించింది. నీతి నిజాయితీలే పెట్టుబడిగా విలువలతో కూడిన వ్యాపరంతో భీమా సరికొత్త అధ్యాయం  లిఖించింది. బీమా తో అనుబంధం అంటే కేవలం డబ్బు ఇచ్చి కొనడంతో ముగిసిపోదు. ప్రేమ, అనుబంధాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతో కొనసాగుతుంది. భీమా బట్టర్ వేసిన బాటలోనే నేటికీ చెరిగిపోని బ్రాండ్ గా భీమా నిలిచింది. ప్రస్తుతం 97వ ఏట అడుగుపెడుతున్న భీమా వ్యాపారం,  దేశవ్యాప్తంగా విస్తరించింది.  నేడు 50 షో రూమ్ లతో భీమా ఒక బలమైన బ్రాండ్ గా దేశంలో నిలబడుతూ  తమ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌.. హైద‌రాబాద్‌లో మ‌రో ఫ్లై ఓవ‌ర్‌, 6 లైన్ ఎక్స్‌ప్రెస్ వే
Business Idea: మీ బిల్డింగ్‌పై ఖాళీ స్థ‌లం ఉందా.? మీరు ల‌క్షాధికారులు కావ‌డం ఖాయం