చంద్రబాబు స్టే తెచ్చుకొని బతుకుతున్నారు.. వాసిరెడ్డి పద్మ

By ramya NFirst Published Apr 2, 2019, 4:48 PM IST
Highlights

వైసీపీ అధినేత జగన్ పై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ప్రజలు ఆయనను గుండెల్లో  పెట్టుకున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. 

వైసీపీ అధినేత జగన్ పై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ప్రజలు ఆయనను గుండెల్లో  పెట్టుకున్నారని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం ఆమె వైసీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. జగన్ మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టారని ఆమె ఆరోపించారు. అక్రమ కేసులను జగన్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు.

చంద్రబాబు మాత్రం తనపై ఉన్న ఒక్క కేసుకు కూడా స్టే తెచ్చుకొని బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారని ఆరోరపించారు.  స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది తాను కాదని ఒక్కసారైనా బయటికి వచ్చి చెప్పారా అని ప్రశ్నించారు.  కేసు అనగానే స్టే తెచ్చుకునే వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. . ఆయనను స్టేల బాబు అని పిలిస్తేనే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

ఓటమి భయం చంద్రబాబుకి పట్టుకుందన్నారు. అందుకే టెలికాన్ఫరెన్స్ పెట్టిమరీ.. జగన్ ని తిట్టండి అని పార్టీ నేతలకు చెబుతున్నారన్నారు. అభివృద్ధి గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పరని మండిపడ్డారు.

కేసుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.  ఆయన దొంగలకే పెద్ద దొంగ అని ఆరోపించారు.  ఇక టీడీపీ అభ్యర్థులు 21 మందిపై కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

చంద్రాబు  బినామీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఎలా సంపాదించారో, ఎన్ని కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారో  తెలియదా అని ప్రశ్నించారు. రాయపాటి, గంటా అక్రమంగా ఎంత సంపాదించారు.. ఎన్ని భూములు కబ్జా చేశారో అందరికీ తెలుసన్నారు.  బోండా ఉమా ఒక ఐపీఎస్ అధికారి చొక్కా పట్టుకున్నారని ఆరోపించారు.  

click me!