పులి నిజమే, మనుషుల రక్తాన్ని తాగుతాడు: జగన్ పై సాధినేని యామిని

By Nagaraju penumalaFirst Published Apr 3, 2019, 3:25 PM IST
Highlights

మనుషుల రక్తాన్ని కృరమృగంలా తాగేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని నిజంగా ఆయన పులేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడును పిల్లితో పోల్చినందుకు గర్వంగా ఉందన్నారు. పందికొక్కుల్లాపడి తినాలనుకుంటున్న వైఎస్ కుటుంబం భారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పిల్లిలా చంద్రబాబు కాపలా కాస్తున్నారని చెప్పుకొచ్చారు. 
 

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నరరూప రాక్షసుడు అంటూ ధ్వజమెత్తారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె నిత్యం మనుషుల రక్తాన్ని తాగే వ్యక్తి వైఎస్ జగన్ అంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. అసెంబ్లీకి వెళ్లడం మానేసి ప్రతీ శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కే నీ కొడుక్కి ఒక్క అవకాశం ఇవ్వాలా అంటూ నిలదీశారు.

నేరచరిత్ర ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా సిగ్గుందా ఓటు అడగడానికి అంటూ వైఎస్ విజయమ్మపై విరుచుకుపడ్డారు. అసలు కడప పౌరుషం మీకు ఉందా అంటూ నిలదీశారు. వైఎస్ జగన్ సింహం అని చంద్రబాబు పిల్లి అనడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

మనుషుల రక్తాన్ని కృరమృగంలా తాగేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని నిజంగా ఆయన పులేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడును పిల్లితో పోల్చినందుకు గర్వంగా ఉందన్నారు. పందికొక్కుల్లాపడి తినాలనుకుంటున్న వైఎస్ కుటుంబం భారి నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు పిల్లిలా చంద్రబాబు కాపలా కాస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఏపీ ప్రభుత్వం ఇస్తున్న పసుపు-కుంకుమ పథకంపై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం చేశారు. నీ పినతల్లి పసుపు కుంకుమ తుడిచేసిన మీకు పసుపు కుంకుమ విలువ ఏం తెలుస్తుందని నిలదీశారు. 

గతంలో మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 250 మంది తెలుగు మహిళల పసుపు కుంకుమలను తుడిచేశారని ఆరోపించారు. అప్పుడు నీ నోరు ఏమైందని నిలదీశారు. నీ నోట్లో మట్టి పెట్టుకున్నావా అంటూ షర్మిలపై విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చెయ్యలేదంటున్న వైఎస్ విజయమ్మకు అసలు కడప పౌరుషం ఉందా అంటూ రెచ్చిపోయారు. రాష్ట్రంలో ఎప్పుడైనా పర్యటించి ఉంటే అభివృద్ధి కనిపించేదన్నారు. 

సీమ నీళ్లు తాగివుంటే ప్రాజెక్టులపై మాట్లాడేవాళ్లు కాదంటూ ధ్వజమెత్తారు. జగన్, విజయమ్మ, షర్మిలలు  పందికొక్కుల్లా రాష్ట్రంపై పడ్డారని ఘాటైన విమర్శలు చేశారు సాధినేని యామిని. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాలని యామిని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తో అంటకాగుతున్న వైఎస్ జగన్ కు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌లో ఉండే మూడు రెక్కల్లో ఒకటి మోదీ, మరోకటి కేసీఆర్ లుకాగా చివరిది వైఎస్ జగన్ అంటూ అభిప్రాయపడ్డారు సాధినేని యామిని. 

click me!